English | Telugu

సెప్టంబర్ 4న 'రుద్రమదేవి'

ఎట్టకేలకు దర్సకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి' సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు. అసలు ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ మధ్యలో కొన్ని ఆర్ధిక ఇబ్బందులు.. దానికి తోడు బాహుబలి సినిమా కూడా విడుదలయ్యేసరికి 'రుద్రమదేవి సినిమా రిలీజ్ డైలమాలో పడింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సెప్టంబర్ 4వ తేదీన 'రుద్రమదేవి' చిత్రాన్ని భారి ఎత్తున విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే మొదట తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదల చేస్తామని తెలిపారు. హిందీలో ఎప్పుడు విడుదల చేస్తారన్నది మాత్రం చెప్పలేదు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో అనుష్క, రానా, అల్లు అర్జున్ నటించారు. 'రుద్రమదేవి' తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డీ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే బాహుబలి సినిమాతో ప్రేక్షకులు ఫుల్లు హ్యాపీతో ఉన్నారు... ఇక రుద్రమదేవి కూడా వచ్చిందంటే అభిమానులకు ఫుల్లు ఫీస్టే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.