English | Telugu

గూగుల్‌ సెర్చ్‌ జాబితాలో మొదటి ఆరుగురు టాలీవుడ్‌ హీరోలే!

ఇండియాలో బాలీవుడ్‌దే పైచేయిగా ఉండేది. సౌత్‌కి చెందిన చిత్ర పరిశ్రమలు కొన్ని విషయాల్లో బాలీవుడ్‌పైనే ఆధారపడేవి. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అయిన అనేక సినిమాలను సౌత్‌లో రీమేక్‌ చేసేవారు. మార్కెట్‌ పరంగా బాలీవుడ్‌ పరిధి ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. ఒక్కసారిగా బాలీవుడ్‌ని పక్కనపెట్టి టాలీవుడ్‌ తన సత్తా ఏమిటో చాటుతోంది. అంతేకాదు, తెలుగు సినిమా గ్లోబల్‌ స్థాయికి చేరుకుంది.

తెలుగు సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో గూగుల్‌లో టాలీవుడ్‌ హీరోల సెర్చింగ్‌ కూడా అధికమైంది. 2025 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసిన హీరోలకు సంబంధించిన జాబితా విడుదలైంది. ఈ లిస్ట్‌లో మొదటి ఆరు పేర్లూ టాలీవుడ్‌ హీరోలవే కావడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. గతంలో బాలీవుడ్‌ హీరోల గురించే ఎక్కువగా గూగుల్‌ సెర్చ్‌ చేసేవారు. ఇప్పుడు అందులోకి టాలీవుడ్‌ హీరోలు వచ్చి చేరారు.

2025లో విడుదలైన భారీ బడ్జెట్‌ సినిమాల గురించి, వాటిలో హీరోలుగా నటించినవారి వ్యక్తిగత విషయాల గురించి, వారి నెక్స్‌ట్‌ ప్రాజెక్టుల గురించి తెలుసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపించినట్టుగా తెలుస్తోంది. గూగుల్‌ సెర్చ్‌ జాబితాలో మొదటి స్థానంలో అల్లు అర్జున్‌ నిలవగా, రెండో స్థానంలో ప్రభాస్‌, మూడో స్థానంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, నాలుగో స్థానంలో రామ్‌చరణ్‌, ఐదు, ఆరు స్థానాల్లో మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌ ఉన్నారు. బాలీవుడ్‌నే కాదు, గూగుల్‌ సెర్చ్‌ని కూడా ఆక్రమించిన టాలీవుడ్‌ హీరోలు ఇకపై మరెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.