English | Telugu

'బాహుబలి' vs 'భజరంగీ భాయ్ జాన్'.. గెలుపెవరిది

ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా రెండు సినిమాల గురించి చర్చలు బాగా జరుగుతున్నాయి. అవి 'బాహుబలి' ఒకటి.. ఇంకొకటి భజరంగీ భాయ్ జాన్. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలకు స్టోరీ రైటర్ ఒకరే.. అది జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్దు కాసుల వర్షం కురుస్తున్నాయి. ఇంతవరకూ పెద్దగా రాజమౌళి తండ్రి గురించి కొంత మందికి తెలిసినా.. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో ఒక్కసారిగా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ 'బాహుబలి' vs 'భజరంగీ భాయ్ జాన్' లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యింది అని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన 'బాహుబలి' మొదటి ఆరు రోజుల్లో 285 కోట్లు సాధించగా 'భజరంగీ భాయీజాన్‌' 169 కోట్లు సాధించింది. ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ కూడా ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఎవ్వ‌రిది పైచేయిగా నిలుస్తుందా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి 'బాహుబలి', 'భజరంగీ భాయీజాన్‌' మూవీల మధ్య పోటీ గట్టిగానే ఉందని సినీ విశ్లోషకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టవుతుందో తెలియదు కానీ.. ఈ సినిమాల వల్ల విజయేంద్ర ప్రసాద్ సూపర్ హిట్టయ్యాడని మాత్రం తెలుస్తోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.