English | Telugu

మళ్లీ ఒక్కటవుతున్న ప్రేమపావురాలు..!

బాలీవుడ్ లో ఏ జంట మధ్య లవ్ ఎప్పుడు పుడుతుందో, అంతలోనే ఎందుకు బ్రేకప్ అవుతుందోనన్నది చిదంబర రహస్యమే. ఒక స్టార్ లవ్ కపుల్. బాగా కలిసి తిరిగారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంటికి మూవ్ అయిపోయారు కూడా. కానీ ఏమైందో ఏమో ఒక్కసారిగా మనస్పర్ధలొచ్చేశాయి. ఇద్దరూ కలిసి కట్టుకున్న లవ్ నెస్ట్ నుంచి ఒక పావురం ఎగిరిపోయింది. ఇద్దరూ ఎక్కడ ఎదురుపడినా ఎడమొఖం, పెడమొఖమే. ఈ ప్రేమపక్షుల పేర్లు రణ్ బీర్ కపూర్, కత్రినా కైఫ్. గత రెండేళ్లుగా వీళ్ల గురించి రాసినంతగా మరే కపుల్ గురించీ సినీ జర్నల్స్ రాయలేదు. బ్రేకప్ అయిపోయినా, ఇద్దరూ ప్రొఫెషనల్స్ కాబట్టి, జగ్గాజాసూస్ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అయితే సినిమా వర్కింగ్ వరకూ ఓకే గానీ, ఫంక్షన్స్ కు అటెండ్ అయినప్పుడు కూడా ఇద్దరి మధ్యా బంధంలో ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ లేదు.

కానీ వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఆర్తి పుట్టిన రోజున మాత్రం, పార్టీకి ఒకే టైం లో వచ్చారట. విచిత్రమేంటంటే, అక్కడ అందరూ అనుకున్నట్లు ఇద్దరూ అటూ ఇటూ పోకుండా, కలిసి కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారట. పార్టీలో రణ్ బీర్ వెళ్లేంతవరకూ ఉన్న కత్రినా, రణ్ బీర్ వెళ్లిన తర్వాతే వెళ్లిందట. దీంతో ఇద్దరికీ మళ్లీ ప్యాచ్ అప్ అవుతోందని బాలీవుడ్ వర్గాలు కిసుక్కుమంటున్నాయి. దీపికాతో బ్రేకప్ తర్వాత కత్రినాతో ప్రేమలో పడిన రణ్ బీర్, ఆ తర్వాత ఇంకెవరినీ తగులుకోలేదు. కత్రినా పై ఇంకా ప్రేమ ఉండటమే అందుక్కారణమని ముంబై సినీ వర్గాలు చెబుతున్నాయి. దీని బట్టి చూస్తే త్వరలోనే మళ్లీ ఈ ప్రేమ పావురాలు ఒక్కటవుతున్నాయన్నమాట..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.