English | Telugu

సర్దార్ రిలీజయ్యే వరకూ పవన్ కనిపించడా..?

పవన్ కళ్యాణ్ ఆడంబరాలకు చాలా దూరం. జనానికి, కెమేరాలకు వీలైనంత డిస్టెన్స్ మెయింటెయిన్ చేయాలనుకుంటారు. కానీ వృత్తి పరంగా అందుకు వ్యతిరేకంగా కెమేరాలకు కనిపించాలి. జనం ముందుకొచ్చి మాట్లాడాలి. అయినా ఇప్పటికీ, తనకు ఇంత ఫేమ్ అండ్ నేమ్ ఉన్నా, పబ్లిసిటీకి చాలా దూరంగానే ఉంటారు పవర్ స్టార్. సర్దార్ ఆడియోకు ముందు కూడా, తనకు ఆడియో ఫంక్షన్లలాంటివి నచ్చవని, కానీ అభిమానుల కోసం తప్పట్లేదని ఖచ్చితంగా చెప్పేశారాయన. లేటెస్ట్ టాక్ ప్రకారమైతే, ఇక సినిమా రిలీజయ్యే వరకూ మళ్లీ పవన్ కనిపించే అవకాశం లేదు. ఈ మూవీలో కేవలం నటించడమే కాక, స్క్రీన్ ప్లే, కథ, కొరియోగ్రఫీ, ఫైట్స్ ఇలా ఆల్ మోస్ట్ అన్ని డిపార్ట్ మెంట్స్ లోనూ ఆయన హ్యాండ్ ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, తనలాంటి హీరోను ఎలా హ్యాండిల్ చేయాలి అన్నదానిపై డైరెక్టర్ బాబీకి తనే అండగా నిలిచాడు. పైగా ప్రొడ్యూసర్ కూడా. దాంతో ఈ సినిమా కోసం తన పాత పద్ధతులు పక్కన పెట్టి, విపరీతమైన ప్రెస్ మీట్లతో పవన్ హోరెత్తిస్తాడని అందరూ అనుకున్నారు. దానికి భిన్నంగా, పవన్ మళ్లీ తెలుగు మీడియాలో కనిపించలేదు. కేవలం ట్రైలర్లు, సాంగ్స్ తో సర్దార్ మోతమోగుతోంది తప్ప, పవన్ ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ కార్యక్రమాల్లాంటివేమీ పెట్టుకోలేదు. ఇక డైరెక్ట్ గా సినిమా హిట్టైన తర్వాతే, అత్తారింటికి దారేది సినిమాకు పెట్టినట్టు, అభిమానులకు థ్యాంక్స్ గివింగ్ ఫంక్షన్ పెడతాడట పవన్. అసలు బయటికి రావడమే కష్టంగా ఉండే ఆయన, తన అభిమానులకోసం ఎలాంటి ఫంక్షన్ పెట్టినా వాళ్లకు అదే పదివేలు..!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.