English | Telugu

వర్మ కంపెనీని స్వయంగా వచ్చి చూసిన సర్కార్..!

రాంగోపాల్ వర్మ టాలీవుడ్ ను వదిలేశానని, వంగవీటి తనకు ఇక్కడ చివరి సినిమా అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇలాగే అంటాడు గానీ మళ్లీ తర్వాత వస్తాడులే అని తెలుగు ప్రేక్షకులు అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా వర్మ ముంబైలో ఓపెన్ చేసిన కంపెనీ ఆఫీస్ చూస్తే, వర్మ నిజంగానే ముంబైకి పెర్మనెంట్ గా చెక్కేశాడేమో అని డౌట్ రాక మానదు. తనకున్నదంతా ఊడ్చేసి, ముంబైలో కంపెనీ అనే పేరుతో భారీ ఆఫీస్ ను ఓపెన్ చేశాడు వర్మ. మంచి విస్తీర్ణంలో, కాస్ట్లీ ఫర్నీచర్ తో చాలా రిచ్ గా ఈ ఆఫీస్ ను వర్మ నిర్మించుకున్నాడు. ఇకపై తన సినిమాల్ని ఏదో తీశామంటే తీశాం అన్నట్టుగా కాకుండా, తన టాలెంట్ తో మంచి సినిమాలు నిర్మించాలని, డైరెక్ట్ చేయాలని వర్మ అనుకుంటున్నాడట. కంపెనీ అంటూ పేరు పెట్టి, దీనికి తన సర్కార్ అమితాబ్ ను ఆహ్వానించాడు వర్మ. మొత్తం ఆఫీస్ ను అమితాబ్ బచ్చన్ తిరిగి చూశారు. ఒక గదిలో, వర్మ అమితాబ్ సర్కార్ లో ఉన్న స్టిల్ ను లైఫ్ సైజ్ లో గోడ మీద పెట్టుకోవడం విశేషం. ఇంతకీ ఇంత ఉన్న పళంగా, వర్మగారు అక్కడ కంపెనీ ఎందుకు ఓపెన్ చేశారు చెప్మా..?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.