English | Telugu

వినాయ‌క్ హీరో... పూరి జీరో

పూరి జ‌గ‌న్నాథ్ Vs డిస్టిబ్యూట‌ర్స్ వ్య‌వ‌హారంలో... అంద‌రి వేళ్లూ ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ వైపుకే చూపిస్తున్నాయి. ఈ విష‌యంలో త‌ప్పంతా పూరిదే అంటూ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. నాలుగ్గోడ‌ల మ‌ధ్య తేల్చుకోవాల్సిన వ్య‌వ‌హారాన్ని రోడ్డు కీడ్చి, పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కూ తీసుకెళ్లి, కేసులు పెట్టి నానా హంగామా చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని పూరిని నిల‌దీస్తోంది ఇప్పుడు చిత్ర‌సీమ‌.

ఓ సినిమాకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల‌న్నీ నిర్మాతతోనే ముడిప‌డి ఉంటాయి. దాన్ని కాద‌న‌లేం. ఓ సినిమా ఫ్లాప్ అయిన‌ప్పుడు ఆ పంపిణీదారులు కాస్తో కూస్తో న‌ష్టాన్ని భ‌ర్తీ చేయ‌మ‌ని నిర్మాత‌నే బ‌తిమాలుకొంటుంటారు. ఓ సినిమా ఫ్లాప్ అయితే.. ముందు మునిగిపోయేది నిర్మాతే. అందుకే ఆ సినిమాతో లాభ‌ప‌డిన హీరో, ద‌ర్శ‌కుడి వైపు చూసి చేతులు చాచాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఓ సినిమాకి ఆరు నుంచి ఏడు కోట్లు పారితోషికం తీసుకొనే ద‌ర్శ‌కుడు పూరి జ‌గన్నాథ్‌. అందులో కాస్త‌యినా ఇచ్చి మ‌మ్మ‌ల్ని ఆదుకోండి అని అభ్య‌ర్థించారు.. పంపిణీదారులు. ఇది డిమాండ్ కాదు.. కేవ‌లం అభ్య‌ర్థ‌న మాత్ర‌మే. దానికే పూరి ఇంత రాద్ధాంతం చేయాలా;?

అఖిల్ సినిమా విష‌యంలో ఏం జ‌రిగిందో ఒక్క‌సారి గుర్తుకు తెచ్చుకొంది. ఆసినిమా వ‌ల్ల అందరూ భారీ ఎత్తున న‌ష్ట‌పోయారు. కానీ వి.వి.వినాయ‌క్ నైతిక బాధ్య‌త తీసుకొన్నాడు. సినిమా విడుద‌లైన రెండో రోజే డిస్టిబ్యూట‌ర్ల‌కు ఫోన్ చేసి 'మీకు నేనున్నా.. అధైర్య‌ప‌డొద్దు' అని ధైర్యం ఇచ్చాడు. తాను అందుకొన్న పారితోషికం నుంచి సుమారు రూ.3 కోట్ల రూపాయ‌లు తిరిగి ఇచ్చేశాడు. దాంతో అఖిల్ కొన్న వాళ్లంతా మ‌ళ్లీ కోలుకొన్నార‌ని కాదు.. కాస్త‌యినా స్వాంత‌న ల‌భించింది. ఇప్పుడు పూరి కూడా అదే చేయాల్సింది. న‌ష్ట‌ప‌రిహారం త‌న వ‌ల్ల కాక‌పోతే దాన్నే సున్నితంగా చెప్పాల్సింది. అంతే త‌ప్ప‌.. ఇంత రాద్దాంతం చేయాల్సింది కాదు. ఈ ఎపిసోడ్‌తో తేలిందేమిటి? పూరి లాభ‌ప‌డిందేమిటి? డిస్టిబ్యూట‌ర్ల దృష్టిలో వినాయ‌క్ మ‌రోసారి హీరో అయ్యాడు.. పూరి జీరోగా మిగిలిపోయాడంతే. ఈ యాంటీ క్లైమాక్స్‌ని పూరి కూడా ఊహించి ఉండ‌డు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.