English | Telugu

ట్రావెల్ బస్సుల్లో ప్లే అవుతున్న విజయ్ "పోలీస్"

పైరసీ...ఈ పదం వింటే సినీ ప్రపంచం వణికిపోతోంది. కోట్ల రూపాయల ఖర్చుని..సంవత్సరాల కష్టాన్ని రాత్రికి రాత్రి దోచేసే రాక్షసి పైరసీ. ఉదయం సినిమా విడుదలైతే మధ్యాహ్నం సినిమా నెట్‌లోకి వచ్చేస్తుంది. దీంతో ఎంతోమంది కష్టం బుగ్గిపాలవ్వడంతో పాటు నిర్మాతకు భయంకరమైన నష్టాలు మిగులుతాయి. పైరసీ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చెప్పడానికి తాజా ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన తేరి సినిమా శుక్రవారం రిలీజైంది. ఆ సినిమాను తెలుగులో పోలీస్‌గా విడుదల చేశారు. ఈ సినిమాను బాహాటంగానే ఏసీ బస్సులో వేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

తిరుచ్చి నుంచి తంజావూరుకు వెళ్తున్న ఏసీ బస్సులో ప్రదర్శించారు. అయితే ఇదే బస్సులో ప్రయాణిస్తున్న విజయ్ అభిమాని తమ వాళ్లకు ఫోన్ చేసి చెప్పడంతో తంజావూరుకు చేరుకున్న వెంటనే విజయ్ అభిమానులు బస్సును చుట్టుముట్టారు. వెంటనే బస్సును అణువణువు తనిఖీ చేసి సీడీనీ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం నిర్మాతల దాకా వెళ్లడంతో వారు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో తమిళనాడులోని సీడీ షాపులపై దాడులు చేసి పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.