English | Telugu

డామిట్‌..ప‌వ‌న్ చేతులెత్తేశాడు..!

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌.. బ‌య్య‌ర్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పేరు. ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్న ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర‌.. బోర్లా ప‌డింది. కోట్లు పోసి కొన్న బ‌య్య‌ర్లు..ఇప్పుడు పీక‌ల్లోతు న‌ష్టాల్లో మునిగిపోయారు. చాలా చోట్ల స‌గానికంటే ఎ ఎక్క‌ువ సొమ్ములు పోయాయి. అందుకే పంపిణీదారులు మొత్తం... 'ఆదుకో.. ప‌వ‌న్‌' అంటూ మొర‌పెట్టుకొంటున్నారు. ప‌వ‌న్ మంచిత‌నం గురించి తెలిసిన బ‌య్య‌ర్లు నిన్న‌టి వ‌ర‌కూ... కాస్త ధీమాగానే ఉన్నారు. జాని సినిమా స‌మ‌యంలో.. బ‌య్య‌ర్లు ఇలానే తీవ్రంగా న‌ష్ట‌పోతే, వాళ్లంద‌రికీ ద‌గ్గ‌రుండి న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించాడు. సేమ్ ఇప్పుడూ అదే ప‌రిస్థితి ఎదురైంది. దాంతో ప‌వ‌న్ అప్ప‌ట్లానే ఆదుకొంటాడ‌నుకొన్నారు. కానీ ప‌వ‌న్ ఇప్పుడు స‌డ‌న్‌గా చేతులెత్తేసిన‌ట్టు స‌మాచారం.

ఈమ‌ధ్య కొంత‌మంది బ‌య్య‌ర్లు ప‌వ‌న్‌ని క‌లుసుకొని త‌మ గోడు వెలుబుచ్చారు. అప్పుడు ప‌వ‌న్ సానుకూలంగానే స్పందించాడు. ఇప్పుడు మాత్రం.. ''ఈ సినిమా వ‌ల్ల శ‌ర‌త్ మ‌రార్ కూడా న‌ష్ట‌పోయారు. ఆయ‌న్ని న‌ష్టాన్ని భ‌ర్తీ చేయ‌డ‌మ‌న‌డం భావ్యంకాదు'' అంటున్నాడ‌ట‌. దాంతో బ‌య్య‌ర్లు ల‌బోదిబోమంటున్నారు. అయితే.. ప‌వ‌న్ వాళ్ల‌కు ఓ ఆప్ష‌న్ ఇచ్చాడు. ఎస్‌.జె.సూర్య‌తో చేస్తున్న సినిమాని స‌ర్దార్ సినిమాకొన్న బ‌య్య‌ర్ల‌కే త‌క్కువ రేటుకి ఇస్తాన‌ని ప‌వ‌న్ మాటిచ్చాడ‌ట‌. దాంతో.. బ‌య్య‌ర్లు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్టైంది. మ‌న‌లో మ‌న మాట‌... ఎస్‌.జె సూర్య సినిమా కూడా పోతే.. అప్పుడు ప‌రిస్థితేంటి? గ‌తంలో ఇలానే ఆంధ్రావాలా పోతే ఎన్టీఆర్‌.. బయ్య‌ర్లున ఆదుకోవాల‌నుకొన్నాడు. నా అల్లుడు సినిమా తీసి స‌గం రేట్ల‌కే ఇచ్చేశాడు. ఆ సినిమా కూడా అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ప‌వ‌న్ విష‌యంలోనూ అదే జ‌రుగుతుందా? డౌటే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.