English | Telugu

సరైనోడు రన్ టైం లాక్ అయింది..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వస్తున్న సినిమా సరైనోడు. ఏప్రిత్ 22న విడుదల కానున్న సరైనోడు రిలీజ్ కోసం మూవీ టీం ప్రమోషన్లతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు బోయపాటి కూడా సినిమా రన్ టైం ను లాక్ చేయించాడట. సరిగ్గా రెండు గంటల నలభైనిముషాలకు సినిమా టైం ను ఫిక్స్ చేయించాడట బోయపాటి. రెండున్నర గంటలకు మించి సినిమా రన్ టైం ఈ మధ్య కాలంలో ఉండట్లేదు. అలాంటిది మరో పది నిముషాల ఎక్స్ ట్రా టైం అంటే, బోయపాటి ధైర్యం చేస్తున్నట్టే. రన్ టైం తగ్గే కొద్దీ సినిమాలో షార్ప్ నెస్, స్పీడ్ పెరుగుతుంది. కానీ సినిమాలో పట్టుంటే మాత్రం, రన్ టైం మూడు గంటలున్నా జనాలు చూస్తారు. ప్రస్తుతానికి బోయపాటి అదిరిపోయే తరహాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ను డిజైన్ చేశాడనే వార్త వినిపిస్తోంది. సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్స్ లో ఒకటిగా నిలవనుందట. ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి పూర్తి మీసకట్టుతో, డిఫరెంట్ గెటప్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేయడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.