English | Telugu

ప‌వ‌న్ ఎప్ప‌టికీ ట్రెండ్ సెట్ట‌రే గురూ..!

నేను ట్రెండ్ ఫాలో అవ్వ‌ను..ట్రెండ్ సెట్ చేస్తానంటూ గ‌బ్బ‌ర్ సింగ్ లో చెప్పిన‌ట్టే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగు తెర‌పై హీరో లుక్ మార్చి హీరో మేనరిజానికి స‌రికొత్త భాష్యం చెప్పారు. మిడిల్ క్రాఫైనా..హార్లే డేవిడ్స‌న్ బైక్ అయినా, బాలులో ఫ్యాంట్ పై ఫ్యాంట్ వేసినా ప‌వ‌న్ కే చెల్లింది. సినిమా సినిమాకో వేరియేష‌న్ చూపిస్తూ ట్రెండ్ విష‌యంలో నూత‌నత్వాన్ని చూపిస్తున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గ‌బ్బ‌ర్ సింగ్ లో పోలీస్ డ్రెస్ అంటే ఇస్త్రీ న‌ల‌గ‌కుండా టక్ చేసి హుందాగా ఉండాల‌నే పాత కాల‌పు క‌ట్టుబాట్ల‌ని మార్చి పోలీస్ బెల్ట్ న‌డుముకి క‌ట్టి త‌ల‌కి రెడ్ క‌ల‌ర్ కండువాని క‌డితే తెలుగు నాట ప్ర‌భంజ‌న‌మైంది. దీనిని అనుక‌రిస్తూ ఎంతో మంది హీరోలు సంద‌డి చేశారు.

ఇపుడు గ‌బ్బ‌ర్ సింగ్ కు సీక్వెల్ గా వ‌స్తున్న స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో కూడా లుక్ విష‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నారు ప‌వ‌న్. దానికి త‌గ్గ‌ట్టే కొత్త‌గా రిలీజైన ఫోటోస్ లో ఫ్యాంట్ కి బ‌దులు గ‌ళ్ల లుంగీ క‌ట్టి దానిపై పోలీస్ ష‌ర్ట్ వేసి దానికి బెల్ట్ పెట్టారు ప‌వ‌న్. అక్క‌డితో ఆగ‌కుండా స‌గం షేవింగ్ చేసుకుని భుజాన గ‌న్ తో మెడ‌లో కండువాతో మ్యాన్లీ లుక్ న‌డిచి వ‌స్తున్న లేటేస్ట్ పిక్చర్స్ అభిమానుల్ని పిచ్చెక్కిస్తున్నాయి. దీన్ని చూస్తుంటే మ‌రో సరికొత్త ట్రెండ్ కి ప‌వ‌న్ శ్రీకారం చుట్టిన‌ట్టే క‌నిపిస్తుంది. ఈ గెట‌ప్ తో సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ అయింది. మ‌రి రానున్న రోజుల్లో ఈ గెట‌ప్ ఎంత సెన్షేష‌న్ క్రియేట్ చేస్తుందో.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.