English | Telugu

నయనతార లవ్ అఫైర్ మళ్లీ బ్రేకప్ అయిందా..?

చూడబోతే నయనతారకు పాపం ప్రేమ అచ్చొచ్చినట్టు లేదు. ఎంతమందితో ప్రేమాయణాలు నడిపినా, అవి చివరికి పెటాకులుగానే మిగిలిపోతున్నాయి. తన సినిమాల కంటే లవ్ ఎఫైర్లతోనే బాగా ఫ్యామస్ అయింది. మొదట శింబుతో మన్మథ సినిమా టైంలో ఘాటుగా లవ్ స్టోరీని నడిపింది. వీళ్లిద్దరికీ సంబంధించిన చాలా ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. కానీ ఆ తర్వాత ఇద్దరూ బ్రేకప్ అయిపోయారు. ఈ బ్రేకప్ ఎఫెక్ట్, చాలా కాలం వరకూ నయనను వేధించింది. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం మొదలైంది. ఇద్దరూ దాదాపు పెళ్లి పీటల వరకూ వచ్చేసిన టైం కి, ఆ రిలేషన్ కూడా బాల్చీ తన్నేసింది. నిజానికి అప్పటికి శ్రీరామరాజ్యం చేస్తున్న నయన, ఇక ఆ సినిమాతో కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి, ప్రభుదేవాతో సెటిల్ అయిపోదామని కూడా అనుకుంది. కానీ అవేమీ జరగలేదు. ఇక ముచ్చటగా మూడో కథ, నేనూ రౌడీనే సినిమా దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో జరిపింది. మొదట పుకారే అని అందరూ అనుకున్నా, అతన్ని హగ్ చేసుకుని ఉన్న ఫోటోను నయన తన వాట్సాప్ ఫ్రొఫైల్ పిక్ గా పెట్టడంతో, విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారం కూడా హుళక్కయ్యేలా ఉందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. పెళ్లి చేసుకుందామని విఘ్నేశ్ అంటుంటే, ఆఫర్లు వస్తున్నప్పుడు వదిలెయ్యడమెందుకు, అవకాశాలు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుందామని నయన అంటోందట. దీంతో ఇద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి, బ్రేకప్ కు చాలా దగ్గరగా వెళ్లిందట. మరి ఈ బంధాన్నైనా నయన నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి మరి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.