English | Telugu

స‌ర్దార్‌.. ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షో

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే... ప‌వ‌న్ చుట్టూ తిరగాల్సిందే. ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షో.. చూడాల్సిందే. కేవ‌లం ప‌వ‌న్ మంత్రంతో.. ప‌వ‌న్ బ‌లంతో ప‌వ‌న్ సినిమాలు ఆడేసిన సంద‌ర్భాలు చాలా కనిపిస్తాయి. సర్దార్ విష‌యంలోనూ అదే జ‌రిగింద‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమాని ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షోగా న‌డిపించాడట‌. ఈ సినిమాకి బ‌లం.. బ‌లగం అంతా ప‌వ‌న్ క‌ల్యాణే అని తెలుస్తోంది. ఈ క‌థ‌ని చాలా ఇష్టంగా రాసుకొన్నాడు ప‌వ‌న్‌. త‌న పాత్ర‌ని మ‌రింత ఇష్టంగా తీర్చిదిద్దుకొన్నాడ‌ట‌. త‌న అభిమానులు త‌న‌నుంచి ఏం ఆశిస్తారో, అన్నీ స్ప‌ష్టంగా తెలుసిన ప‌వ‌న్‌.. వాళ్ల ఆలోచ‌న‌ల‌కు, అంచ‌నాల‌కూ త‌గ్గ‌ట్టే త‌న పాత్ర‌ని డిజైన్ చేసుకొన్నాడ‌ట‌. మ‌రీ ముఖ్యంగా పోలీస్ స్టేష‌న్ చుట్టూ అల్లుకొన్న స‌న్నివేశాలు.. సూప‌ర్బ్ గా వ‌చ్చాయ‌ని టాక్‌.

తెర‌పైనే కాదు, తెర వెనుక కూడా ప‌వ‌న్ త‌న పవ‌ర్ చూపించాడు. సెట్లో.. ప‌వ‌న్ ఏం చెబితే అదే న‌డిచింది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులూ.. ఇలా అంద‌ర్నీ ప‌వ‌న్ ఏరి కోరి ఎంచుకొన్నాడు. ఆఖ‌రికి ఎవ‌రు ఏయే కాస్ట్యూమ్స్ వేయాలో.. ప‌వ‌నే డిసైడ్ చేశాడ‌ట‌. ఏ షాట్ ఎలా తీయాలో స్ర్కీన్ ప్లే లోనేప‌వ‌న్ రాసుకొన్నాడ‌ని చిత్ర‌బృంద‌మే చెబుతోంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ విష‌యంలోనూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ద‌గ్గ‌రుండి.. త‌న టీమ్‌ని న‌డిపిస్తున్నాడ‌ట‌. ప‌వ‌న్ నిద్రే లేకుండా ల్యాబుల్లోనే గ‌డుపుతున్నాడ‌ని, సినిమా రిలీజ్ అయ్యేంత వ‌ర‌కూ ప‌వ‌న్‌కి తీరికే లేద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ప్ర‌తీ సీన్‌, ప్ర‌తీ షాట్‌.. ప‌వ‌న్ చూశాకే ఓకే అవుతోంద‌ట‌. ఆర్‌.ఆర్ విష‌యంలో, క‌ల‌ర్ గ్రేడింగ్ విష‌యంలోనూ ప‌వ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకొంటున్నాడ‌ట‌. సాధార‌ణంగా ప‌వ‌న్ త‌న సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్త‌యితే మ‌రే విష‌యంలోనూ క‌ల‌గ‌చేసుకోడు. సినిమా ఎలా వ‌స్తుందా అని కూడా ఆరా తీయ‌డు.కానీ స‌ర్దార్ విష‌యంలో మాత్రం ప‌వ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపించ‌డం ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల‌నే కాదు, ఆయ‌న స‌న్నిహితుల్ని కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. దీనంత‌టికీ కార‌ణం.. ఈ సినిమాకి ప‌వ‌న్ నిర్మాత అనేనా..?? ఇంకేమైనా కార‌ణాలున్నాయా??

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.