English | Telugu

ప్రధాని మోడీకి రాఖీ సావంత్ రిక్వెస్ట్..!

నిత్యం వార్తల్లో ఉండటం కొంతమందికి చాలా ఇష్టం. తమను ఎవరూ పట్టించుకోకపోయినా, ఏదోక న్యూస్ తో జనాల నోళ్లలో నలుగుతుండాలి అని భావిస్తారు వాళ్లు. ఆ కోవలోకే వస్తుంది రాఖీ సావంత్. ఐటెం గాళ్ గా హద్దులు దాటేసినా, రాఖీ కా స్వయంవర్ పేరుతో పెళ్లి చేసుకుని వదిలేసినా, అది ఆమెకే చెల్లింది. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో, రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్, ఆమెను నిరంతరం హింసించేవాడని, ఆమెను కొట్టద్దని రాహుల్ కు తాను చాలాసార్లు చెప్పానంటోంది. ఆమె మరణానికి పరిహారంగా, ప్రత్యూష కుటుంబానికి 5 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది రాఖీ. మరో వైపు ఇండియాలో సీలింగ్ ఫ్యాన్స్ వాడకాన్ని పిఎం మోడీ బ్యాన్ చేయాలని, భారతీయులందరూ కూడా తమ ఇళ్లలో ఉన్న సీలింగ్ ఫ్యాన్స్ అన్నింటినీ పీకి బయటపారేయాలని సూచిస్తోంది. తప్పదనుకుంటే టేబుల్ ఫ్యాన్ లేదా ఏసీలను వాడాలని సలహా ఇస్తోంది. కాగా ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో, ఆమె మరణం వెనుక మిస్టరీ వీడిపోయే అవకాశం ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.