English | Telugu

ప‌వ‌న్ గ‌ట్స్‌... ఇంకెవ‌రికి సాధ్యం??

మీ అభిమాన క‌థానాయ‌కుడు ఎవ‌రూ... అని మ‌న టాప్ హీరోలెవ్వ‌రినైనా అడిగిచూడండి. ఏ ఇబ్బందీ లేకుండా ఏ అమితాబ్ బ‌చ్చ‌న్ పేరో.. జాకీచాన్ పేరో చెబుతారు. టాలీవుడ్‌లో అంత‌కు మించిన పోటుగాళ్లు లేర‌ని కాదు, ఎవ‌రి పేరు చెబితే ఏం అయిపోతుందో, ఫ్యాన్స్ ఎలా ఫీల‌వుతారో, సొంత ఇమేజ్‌ని చిన్న బుచ్చుకొంటున్న‌ట్టు ఉంటుందేమో అని భ‌యం. చ‌ర‌ణ్‌ని అడిగితే.. చిరంజీవి అంటాడు. బ‌న్నీని అడిగినా అదే మాట చెబుతాడు. ఎన్టీఆర్ ని అడిగితే.. 'నా గురువు దైవం అంతా తాత‌య్యే' అని పాత పాట పాడ‌తాడు. కానీ ప‌వ‌న్ ఏం చెప్పాడో తెలుసా..?? ''నా అభిమాన క‌థానాయ‌కుడు నంద‌మూరి తార‌క రామారావు. ఆయ‌న ఇమేజ్‌, ఆయ‌న అభిమాన‌గ‌ణం ఎవ్వ‌రికీ రాలేదు'' అంటూ.. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా నిక్క‌చ్చిగా స‌మాధానం చెప్పాడు.

కొణిదెల ఫ్యామిలీ - నంద‌మూరి కుటుంబం మ‌ధ్య ఎలాంటి శ‌త్రుత్వం లేదుగానీ.. పోటీ మాత్రం కావ‌ల్సినంత ఉంది. అలాంట‌ప్పుడు ఎన్టీఆర్ పేరు చెప్పడ‌మంటే మామూలు విష‌య‌మా?? అది ప‌వ‌న్ క‌ల్యాణ్ కే సాధ్యం. ప‌వ‌న్ మాట కూడా అక్ష‌రాలా నిజం. ఎన్టీఆర్ అంత ఇమేజ్ తెలుగులో ఎవరు తెచ్చుకొన్నారు గ‌నుక‌? ఆ ద‌రి దాపుల్లోకి వెళ్ల‌గ‌లిగింది చిరంజీవి ఒక్క‌డే. మెగా హీరోల్లో ఎవ‌రిని అడిగినా 'చిరంజీవిని మించిన హీరోలేడు' అనే అంటారు. కానీ ప‌వ‌న్ మాత్రం.. నిజాయ‌తీగా స‌మాధానం చెప్పాడు. అంతేకాదు... ''నాకు న‌ట‌న పెద్ద‌గా రాదు. డాన్సులు చేయ‌లేను. ఏదో ఇలా బండి లాగించేస్తున్నా. నా సినిమాలు హిట్ట‌వుతున్నాయంటే నాకే న‌మ్మ‌శక్యం కావవం లేదు'' అంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎలాంటి ఇగో లేకుండా మాట్లాడాడు. అందుకే అనేది.. వ‌న్ అండ్ ఓన్లీ ప‌వ‌న్ అని. అత‌ను సామాన్యుడిగా క‌నిపించే అస‌మాన్యుడ‌ని!! జ‌య‌హో ప‌వ‌న్‌..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.