English | Telugu

బ్రహ్మోత్సవం.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఎవరు?

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బ్రహ్మోత్సవం. మామూలుగా సినిమాకి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ హీరోనే. మరి అమ్మాయిల కలల రాకుమారుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా యాక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఆయనే ఎట్రాక్షన్ అవుతారు. దీనిలో భాగంగా షూటింగ్ లోకేషన్‌లో కాజల్, సమంత, ప్రణీతలు మహేశ్‌తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. అలాగే వాటిని తమ తమ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేశారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

ఇప్పుడు మహేశ్‌ను పక్కకు నెట్టి ఒక చిన్నారి షూటింగ్ స్పాట్‌లో సెంటార్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. ఆ చిన్నారి ఎవరో కాదు మహేశ్ గారాల పట్టి సితార. ఖాళీ సమయం దొరికితే మహేశ్‌తో ముచ్చట్లు చెప్పుకోవడానికి ఆ చిత్రంలోని వారంతా క్యూకట్టేవారు. కానీ ఇప్పుడు సీతార ఎంట్రి ఇచ్చాక సెట్‌లో ఉన్న వారంతా ఆ చిన్నారితో ఆడుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మొన్న సమంత, సితారతో దిగిన ఫోటోలు హల్‌చల్ చేయగా ఇప్పుడు సీనియర్ నటి రేవతితో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అందరూ సితార చుట్టూ తిరుగుతూ తనను పట్టించుకోకపోవడంతో మహేశ్‌ కూడా కాస్తంత ఇరిటేషన్‌కు గురవుతున్నాడు. అయినా తన కూతురు తనకన్నా ఎక్కువ క్రేజ్‌ తెచ్చుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ప్రిన్స్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.