English | Telugu

సూర్య ' 24 ' : ట్రైలర్ రివ్యూ

హీరో సూర్య త్రిపాత్రాభినయం చేసిన సినిమా 24. ఇష్క్, మనం చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టిన విక్రం కె కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఆడియోతో పాటు, మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ కూడా ఉంది. మూడు వైభిన్నమైన పాత్రలతో సూర్య తనకు అలవాటైన రీతిలో, వైవిధ్యాన్ని పలికించాడు. టైం మెషీన్ లాంటి వాచ్ చుట్టూ కథ తిరుగుతుంది. పాతకాలంలో విలన్ గా, సైంటిస్ట్ గా, ఈ కాలంలో సైంటిస్ట్ కొడుకుగా సూర్య పాత్రలు ఉండబోతున్నాయి. నిత్యా మీనన్ పాత సూర్యతో జతకడితే, సమంత కొత్త సూర్యతో కనిపిస్తోంది. పెద్ద సూర్య వాచ్ సైంటిస్ట్ అయితే, చిన్న సూర్య వాచ్ మెకానిక్. పది నెంబర్లకు కౌంట్ డౌన్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. ఒకే ట్రైలర్లో అనేక షాట్లు కట్ చేశారు. రెండు సార్లు చూస్తే తప్ప ట్రైలర్ పై క్లారిటీ రాదు. అంత స్పీడ్ గా షాట్స్ వెళ్లిపోతుంటాయి. ట్రైలర్ ఎండింగ్ లో విలన్ పాత్ర సూర్య, ఆయుష్మాన్ భవ అంటూ గన్ పేలుస్తున్నప్పుడు ట్రైలర్ ను ఎండ్ చేశారు. రెహమాన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై అంచనాల్ని మరింత పెంచేలా ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.