English | Telugu

నాగార్జున ఊపిరి సెన్సార్ రిపోర్ట్

మనం, సోగ్గాడే చిన్నినాయన సినిమాల తర్వాత మరో వైవిధ్యమైన సినిమా ఊపిరితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కింగ్ నాగార్జున. తమిళ స్టార్ కార్తీ తో మల్టీస్టారర్ గా వస్తున్న ఊపిరి ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలనే పెంచేసింది. లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సింగిల్ కట్ కూడా లేకుండా సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ పొందిందని చిత్రనిర్మాతలు కన్ఫామ్ చేశారు. ఈ రోజుల్లో మినిమం య బై ఏ అయినా ఇస్తున్న సెన్సార్ బోర్డు, ఊపిరికి క్లీన్ యు ఇవ్వడంతో, నాగార్జున అభిమానులు పిచ్చ హ్యాపీస్. పూర్తిగా పిల్లలతో సహా వెళ్లి హాయిగా సినిమా చూడచ్చు అనేది యు సర్టిఫికెట్ అర్ధం. వయెలెన్స్ గానీ, అశ్లీలతకు గానీ తావు లేకుండా తెరకెక్కితేనే కట్స్ లేకుండా యు ఇస్తారు. సో ఊపిరి సెన్సార్ లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. మరి ప్రేక్షకులు ఏ ర్యాంక్ ఇస్తారో తెలియాలంటే మార్చి 25 వరకూ వెయిట్ చేయాల్సిందే.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.