English | Telugu

రహస్యాలు మాట్లాడుతున్న బాలయ్య

ఈ మధ్య బాలయ్య మాటల్లో అంతరార్ధం ఎవరికీ అర్ధం కావట్లేదు. ఏం అడిగినా, చాలా నర్మగర్భంగా సమాధానాలు చెబుతున్నారు. మొన్నటికి మొన్న లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలుస్తారా అని అడిగితే, నేను ఎవరిని పిలవాలో వారినే పిలుస్తాను. ఎవరినీ నెత్తికెక్కించుకోను. గ్లామర్ ఉన్నవాళ్లు చాలా మంది వస్తున్నారు. నేను డిక్టేటర్ పంథాలోనే వెళ్తాను అంటూ సమాధానం ఇచ్చారు. అసలు ప్రశ్నకు పొంతనే లేని ఆ జవాబును విని, జర్నలిస్టులందరూ షాక్ అయ్యారు. కొంతమందైతే అది చిరును ఉద్దేశించి కాదని, వేరే నందమూరి హీరోకు వేసిన పంచ్ అని గుసగుసలాడుకున్నారు.

లేటెస్ట్ గా సావిత్ర ఆడియో ఫంక్షన్లో నారారోహిత్ ను పొగుడుతూ తర్వాత పూర్తిగా డీవియేట్ అయిపోయారు బాలయ్య. యాక్టింగ్ అంటే నవ్వడమే ఏడవటమో కాదు అంటూనే కొంత మంది గతజన్మలో చేసిన పాపాలు అనుభవించడానికి పుడతారు. చాలా తక్కువమంది మాత్రమే నాన్నగారిలా కారణజన్ములుంటారు అంటూ చెలరేగిపోయారు. కానీ ఆయన మాటల్లోని అంతరార్ధమేంటో, ఎవరిని ఉద్దేశించి అన్నారో అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఆ కొంతమంది ఎవరు..? వారి సంగతి ఆడియో ఫంక్షన్లో ఎందుకు చెప్పాల్సి వచ్చింది..?

అసలు బాలయ్య బాబు ఎందుకు ఇలా నిగూడార్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు..? ఆయన ఎవరికి ఇన్ డైరెక్ట్ గా చురకలు వేస్తున్నారు..? ఆయన ఇన్ డైరెక్ట్ స్పీచ్ ల వెనుక అంతరార్ధమేంటి..? ఏమో..ఆయనకే తెలియాలి మరి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.