English | Telugu

బాలయ్య వందలో బాబు ఎంట్రీ..!!

బాలయ్య బాబు కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి కానీ.. బాలయ్య మాత్రం నోరు విప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం బాలయ్య వందో సినిమా ఆదిత్య 369 సీక్వెల్ లో వారసుడి ఎంట్రీ కూడా ఉంటుందని ఫైనల్ అయిందట. ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్ఞ నటిస్తున్నాడని ఈ మూవీతోనే అరంగేట్రం చేయించబోతున్నానని బాలయ్య చెప్పేశారట.ఒక పక్క డిక్టేటర్ హిట్టూ..మరో పక్కా బాలయ్య నటవారసుడి అరగ్రేటం ఫైనల్ కావడంతో ఫ్యాన్స్ సంబరాలు మొదలైపోగా.. మరో నెల రోజుల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయట. ఆదిత్య 369 సీక్వెల్ కి ఆదిత్య 999మాక్స్ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.