English | Telugu

సూపర్ స్టార్ మహేష్ సరికొత్త రికార్డ్..!

మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో హాలీవుడ్ హీరో అని మహేష్ ను ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటుంటారు. పెర్ఫామెన్స్ లో అద్భుతమైన వేరియేషన్స్ పలికించగల నటుడు మహేష్. యువర్స్ ట్రూలీ మహేష్ అన్న పేరు ఆయన అభిమానులకు బాగా పరిచయం. అదే మహేష్ ట్విట్టర్ హ్యాండిల్ పేరు. మహేష్ ట్విట్టర్లోకి వచ్చిన తర్వాత, ఆయన కోసం అప్పటికి ట్విట్టర్ అకౌంట్ లేని వాళ్లు కూడా క్రియేట్ చేసుకుని ఫాలో అవడం మొదలెట్టారు. లేటెస్ట్ గా మహేష్ ట్విట్టర్ రెండు మిలియన్ ఫాలోవర్ల సంఖ్యను దాటింది. అంటే 20 లక్షలు. దక్షిణాది హీరోల్లో ట్విట్టర్ వాడేవాళ్లలో చాలా తక్కువమందికి మాత్రమే 20 మిలియన్ ఫాలోవర్లుండటం విశేషం. దీంతో మహేష్ ల్యాండ్ మార్క్ చేరాడని ఆయన అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తన ట్విట్టర్లో మహేష్ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు పర్సనల్, ప్రొఫెషనల్ అప్ డేట్స్ ఇస్తుంటారు. లేటెస్ట్ గా బ్రహ్మోత్సవం షూటింగ్ ప్రాగ్రెస్ ఫోటోలతో పాటు, బ్రహ్మోత్సవం ప్రొడ్యూసర్ సినిమా ఊపిరి గురించి ట్వీట్ చేశారు మహేష్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.