English | Telugu

బాలయ్య వందో సినిమాలో సన్నీ లియోన్..?

బాలకృష్ణ వందో సినిమాలో సన్నీలియోనా..? వినడానికి విచిత్రంగా ఉన్నా, ఈ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ అని, హేమమాలిని తల్లి పాత్ర అని చాలా రూమర్లు బాలయ్య వందో సినిమా గురించి వచ్చాయి. ఇప్పుడు సన్నీ లియోన్ గాసిప్ తో నటసింహం వందో సినిమా మరింత ఇంట్రస్టింగ్ గా మారింది. రాజుల సినిమా కావడంతో, అన్ని రకాల పాత్రలకు స్కోప్ ఉంటుంది. శత్రురాజు దగ్గర ఉండే ఒక విలనీ ఉమెన్ పాత్ర సినిమాలో ఉందట. ఈ పాత్రకు సన్నీ లియోన్ అయితే, మంచి పబ్లిసిటీ వస్తుందని క్రిష్ భావిస్తున్నాడట. బహుశా బాలీవుడ్ యాక్టర్స్ ను పెట్టి, సినిమాను హిందీలో కూడా దింపే ఆలోచనలో క్రిష్ ఉన్నట్టున్నాడు. సినిమా పెర్ఫక్ట్ గా తెరకెక్కితే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బాలయ్య తిరుగులేని విజయం దక్కించుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మంచు మనోజ్ తో కరెంట్ తీగ సినిమాలో ఆడిపాడిన సన్నీ, బాలయ్య సినిమాలో ఓకే అయితే, సన్నీకి ఇది రెండో తెలుగు సినిమా అవుతుంది. ఉగాది రోజున బాలయ్య ఎనౌన్స్ మెంట్ తోనైనా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.