English | Telugu

ప్రియాంకా చోప్రా సూసైడ్ చేసుకోబోయిందట..!

బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ గా ప్రస్తుతం ప్రియాంక చోప్రా స్టార్ స్టేటస్ లో ఉంది. హాలీవుడ్ లో క్వాంటికో టీవీ సీరీస్, డ్వేన్ జాన్సన్ తో మూవీలో విలన్ రోల్..ఇలా పిగ్గీ చోప్స్ కెరీర్ దూసుకెళ్తోంది. కానీ కెరీర్ మొదలైన కొత్తలో ప్రియాంక సూసైడ్ చేసుకోవాలనుకుందట. ఆ సమయంలో తను రక్షించడం వల్లే ఆమె బయటపడిందని చెబుతున్నాడు అప్పటి ఆమె పర్సనల్ మ్యానేజర్ ప్రకాష్ జాజు. రెండు మూడు సార్లు సూసైట్ ప్రయత్నాలు చేసిందని, చాలా వీక్ గా ఉండేదని తన ట్విట్టర్లో చెబుతున్నాడు. బాలీవుడ్ కు హీరోయిన్ అవుదామని వచ్చేవాళ్లెవరైనా, ముంబైకు ఒంటరిగా రావద్దని, ఒకవేళ వస్తే మాత్రం డిప్రెషన్, ఒంటరితనం పిచ్చి పిచ్చి ఆలోచనలు కలిగిస్తాయంటున్నాడు. ప్రియాంక మాజీ లవర్ అసీమ్ మర్చెంట్ తల్లి మరణం ప్రియాంకను కుంగదీసిందని, ఆ సమయంలో ఆమె కిటికీ నుంచి కిందికి దూకేసే ప్రయత్నం చేయబోయిందని, తానే ఆమెను బలవంతంగా కుర్చీకి కట్టేసి, కంట్రోల్ చేశానని ట్వీట్ చేశాడు ప్రకాష్. అతని మాటల్లో నిజం ఎంత ఉందో పక్కన పెడితే, ప్రియాంక అభిమానులందరూ, ఆమె పేరును ఉపయోగించుకుని జాజూ ఫేమస్ అవడానికి ప్రయత్నిస్తున్నాడంటూ అతన్ని తిట్టి పోస్తున్నారు. ఇంత జరుగుతున్నా, ప్రియాంక ఏమాత్రం స్పందించకపోవడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.