English | Telugu

రెండు భాగాలుగా మహేష్, మణిరత్నం సినిమా

రెండు భాగాలుగా మహేష్, మణిరత్నం సినిమా తీయనున్నారని సమాచారం. వివరాల్లోకి వెళితే మహేష్ బాబు హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనున్న చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. తమిళంలో వ్రాయబడిన "పొన్నియన్ సెల్వన్" అనే చారిత్రాత్మక నవలకు దృశ్యరూపంగా ఈ చిత్రం నిర్మించబడుతోంది.ఈ చిత్రంలో మహేష్ బాబు చోళరాజుగా నటిస్తూండగా, మరో హీరో విక్రమ్ పల్లవరాజుగా నటిస్తూండగా, విజయ్, ఆర్య, అనుష్క ముఖ్యపాత్రల్లో నటిస్తూండగా మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ చిత్రానికి మొత్తం రెండు వందల కోట్ల అత్యంత భారీ బడ్జెట్ ఖర్చుచేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తూండగా, మొదటి భాగం ఎక్కడ ముగుస్తుందో అక్కడే రెండవ భాగం మొదలవుతుందట. ఈ చిత్రం మొదటి భాగానికి వంద కోట్లు, రెండవ భాగానికి వంద కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రానికి గాను మహేష్ బాబు పన్నెండు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.