English | Telugu

ఆ సెట్ కు మూడు కోట్లా..?

నాన్నకు ప్రేమతో సినిమాతో జోష్ మీదున్న ఎన్టీఆర్ తర్వాతి సినిమా జనతా గ్యారేజ్. ఇక్కడ అన్నీ రిపేర్ చేయబడును అనేది సబ్ టైటిల్. అక్కడ తారక్ ఏమేమి రిపేర్ చేస్తాడో తెలీదు గానీ, ఆ సెట్ ను మాత్రం కొరటాల శివ ఒక రేంజ్ లో వేయిస్తున్నాడు. పూర్తిగా రియల్ గ్యారేజ్ లా కనబడాలనేది కొరటాల ఆలోచన. సురేందర్ రెడ్డితో టీం అప్ అయి చేసిన అశోక్ లో కూడా ఎన్టీఆర్ మెకానిక్ గా చేశాడు. కానీ ఆ సినిమాలో వేసిన మెకానిక్ షెడ్ సెట్ కొన్ని సీన్లు, ఫైట్లు వరకూ మాత్రమే పరిమితమైంది.

జనతా గ్యారేజ్ సెట్లో మాత్రం చాలా కీలక సన్నివేశాలుంటాయట. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఖర్చుకు వెనకాడకుండా ఈ సెట్ కు మూడు కోట్లు పెడుతున్నారని సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్ ప్రకాష్ చేసిన ఈ సెట్ కోసం 20 పాత కార్లను కూడా అద్దెకు తీసుకున్నారట. సారధి స్టూడియోస్ లో వేసిన ఈ సెట్లో ఫిబ్రవరి 22 నుంచి ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన తర్వాత, ముంబైలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ మూవీలో, ఎన్టీఆర్ తో సమంత, నిత్యామీనన్ జత కడుతున్నారు. ఎన్టీఆర్ తో సమంతకు ఇది మూడో సినిమా కావడం విశేషం.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.