English | Telugu

సునీల్ కు సెన్సార్ రిపోర్ట్

సునీల్ హీరోగా దిల్ రాజు నిర్మించిన కృష్ణాష్టమి సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. రీజనల్ సెన్సార్ బోర్డ్ కృష్ణాష్టమికి u/a సెర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా రన్ టైం 134 నిముషాలకు లాక్ చేసినట్లు సమాచారం. దిల్ రాజు రన్ టైం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ సరసన నిక్కీ గిల్రానీ, డింపుల్ చోపడే రొమాన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో సినిమా టీం ముమ్మరంగా పాల్గొంటూ, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారు. హీరో సునీల్ ది ఇండియాకు వచ్చి స్థిరపడాలనుకునే ఎన్నారై పాత్ర. సునీల్ సిక్స్ ప్యాక్, కామెడీ హైలెట్స్ గా నిలవబోతున్నాయని ఇన్ సైడ్ టాక్.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.