English | Telugu

స్పిరిట్ ఫస్ట్ లుక్.. అంచనాలను అందుకుందా?

ప్రస్తుతం మోస్ట్ హైప్డ్ ఇండియన్ సినిమాలలో 'స్పిరిట్' ఒకటి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై కేవలం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఆడియో టీజర్ ఆ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. (Spirit First Look)

న్యూ ఇయర్ కానుకగా 'స్పిరిట్' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ లో షర్ట్ లేకుండా, ఒంటినిండా గాయాలతో, చేతిలో మందు బాటిల్ పట్టుకొని ప్రభాస్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రభాస్ ని సందీప్ చూపించే తీరుకి.. ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని అంటున్నారు.

అయితే 'స్పిరిట్' ఫస్ట్ లుక్ పై కొందరు నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. పోస్టర్ ఆర్టిఫిషియల్ గా ఉందని, కొత్తదనం లేదని, సందీప్ రెడ్డి గత చిత్రం యానిమల్ ని గుర్తు చేస్తుందని.. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇలా ఒకట్రెండు నెగెటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ.. మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం 'స్పిరిట్' ఫస్ట్ లుక్ ని ఆకాశానికెత్తేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.