English | Telugu

ప్రముఖ గాయకుడు మృతి.. సంతాపాన్ని తెలిపిన ప్రధాని మోది!

సంగీత ప్రపంచంలో విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని తనకంటూ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకున్నారు పండిట్‌ చన్నులాల్‌ మిశ్రా. శాస్త్రీయ గాయకుడిగా ఆయనకు విశేషమైన పేరు ఉంది. భారతీయ సంగీతానికి మిశ్రా చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ పురస్కారాలను ఆయనకు అందించింది. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల అక్టోబర్‌ 2న ఆయన కన్నుమూశారు. ఉత్తర ప్రదేశ్‌లోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. మిశ్రా మృతి పట్ల సంగీత ప్రపంచంలో ఉన్న దిగ్గజ కళాకారులంతా తమ సంతాపాలను తెలియజేశారు.

ప్రధాన మంత్రి మోది కూడా తన సంతాపాన్ని తెలియచేస్తూ ‘చన్నులాల్‌ మిశ్రా తన జీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు. శాస్త్రీయ సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంతోపాటు విదేశాలలో భారతీయ సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పిన ఘనత ఆయనకే దక్కుతుంది. మిశ్రాగారి ఆశీర్వాదాలు పొందడం నా అదృష్టంగా భావిస్తాను. 2014లో వారణాసి నుంచి పోటీ చేసేందుకు ఆయన నా పేరును ప్రతిపాదించారు’ అంటూ మిశ్రాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మోడి. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు తన సతాపాన్ని తెలిపారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.