English | Telugu

ఇన్ క్రెడిబుల్ డెసిషన్ పై అమీర్ ఏమన్నాడంటే ..

ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచార కార్యక్రమం నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పై అమీర్ ఖాన్ స్పందించాడు. ఇండియా ఎప్పటికి ఇన్‌క్రెడిబుల్ అని అమీర్ పేర్కొన్నాడు. దేశం కోసం సేవలందిండచం గర్వంగా ఉందని, దేశం కోసం పని చేయడానికి ఎనీ టైమ్ రెడీగా వుంటానని అన్నాడు. అలాగే దేశం కోసం పదేళ్లు రూ.3 కోట్ల రూపాయలు వదులుకొని.. ఉచితంగానే సేవలందించానని గుర్తు చేశాడు. నా సేవల్ని నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. దేశ ప్రయోజనాల కోసం వారు తగిన చర్యలు తీసుకొంటారని భావిస్తున్నాను అని అమీర్ అన్నాడు. అసహనంపై అమీర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన సేవలను వాడుకోవద్దనే ఉద్దేశంతోనే కేంద్ర౦ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.