English | Telugu

హృతిక్, కంగనా, ఓ అమీర్ ఖాన్..!

బాలీవుడ్ సూపర్ స్టార్స్ హృతిక్ కంగనాల మధ్య లవ్ ఏమాత్రం సాగిందో కానీ, కేసుల గోల మాత్రం ఎక్కువగానే ఉంది. రోజురోజుకూ ఒకరిపై ఒకరు తమ పర్సనల్ వ్యవహారాన్ని కోర్టు వరకూ ఈడ్చుకుని అభాసుపాలవుతూ వచ్చారు. ఎవరి తప్పు ఎంత ఉందో పక్కన పెడితే, ఎవరో ఒకరు మధ్యలో దూరి విషయాన్ని చక్కబెట్టకపోతే, చాలా దూరం వెళ్తుందేమో అనిపించింది. తాజాగా వీళ్లిద్దరికీ సన్నిహితుడు, బాలీవుడ్ మిస్టర్ పెర్ఫక్షనిస్ట్ అని పేరు పొందిన అమీర్ ఖాన్, సంధి చేసే ప్రయత్నం చేస్తున్నాడట. అటు రోషన్ కుటుంబానికి, ఇటు కంగనా ఫ్యామిలీకి అమీర్ ఖాన్ క్లోజ్ గానే మూవ్ అవుతుంటాడు. అందుకే ఆ చనువుతోనే, వీళ్లిద్దరి గొడవను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రధాని మోడీ ఇచ్చిన ఒక ప్రైవేట్ డిన్నర్ కు అటెండ్ అయిన సమయంలో కంగనతో అమీర్ ప్రత్యేకంగా చాలా సేపు ముచ్చటించాడట. అదంతా ఎఫైర్ గురించేనని బాలీవుడ్ అంటోంది. చిన్న విషయాన్ని ఇద్దరూ కలిసి పెద్దది చేసుకున్నారని అమీర్ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడట. మరి అమీర్ చొరవతోనైనా, ఈ సెలబ్స్ గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి మరి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.