English | Telugu

బాహుబలి రెండో పార్ట్ కు భారీ డిమాండ్..!

బాహుబలి మొదటి పార్ట్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినిమా రిలీజవ్వకముందే, రాజమౌళి పబ్లిసిటీ తెలివితో ఇంటర్నేషనల్ గా పేరు తెచ్చేసుకుంది. రిలీజైన తర్వాత జరిగిన బాక్సాఫీస్ విధ్వంసం అంతా ఇంతా కాదు. రికార్డులన్నింటినీ తుత్తునియలు చేసి సరికొత్త రికార్డులను పద్ధతిగా క్రియేట్ చేసేసింది బాహుబలి సినిమా. అందుకే తర్వాత రాబోయే రెండో పార్ట్ కోసం, దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రేజ్ బాహుబలి కంక్లూజన్ డిమాండ్ ను అమాంతం పెంచేసింది. మొదటి పార్ట్ ను కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హిందీలో రిలీజ్ చేశాడు. రెండో పార్ట్ ను మాత్రం యశ్ రాజ్ ఫిలిమ్స్ దక్కించుకోవాలని చూస్తోంది.

ఈ మేరకు 150 కోట్లకు వరల్డ్ వైడ్ హిందీ రైట్స్, శాటిలైట్ రైట్స్ ను కొనడానికి యశ్ రాజ్ సంస్థ ముందుకొచ్చిందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. దీని బట్టే, బాహుబలికి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏప్రిల్ 14న సినిమాను రిలీజ్ చేయడం కోసం, జక్కన్న అండ్ కో కష్టపడుతున్నారు. ఏప్రిల్ వరకూ వేడిలో కూడా షూటింగ్ జరుపుతున్న బాహుబలి టీం మే నెలలో మాత్రం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత రెగులర్ షూటింగ్ తో అక్టోబర్లో టాకీ పార్ట్ ముగించాలని భావిస్తున్నారట. ఇక అక్కడి నుంచి, సినిమాకు ప్రాణమైన గ్రాఫిక్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క పై జక్కన్న దృష్టి పెట్టనున్నాడని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.