English | Telugu
తెలుగు హీరోయిన్కి కోలీవుడ్ కష్టాలు
Updated : Jul 15, 2014
కష్టజీవి శ్రీదివ్యకు కొత్త కష్టం వచ్చింది. బాలనటిగా ప్రిన్స్ మహేష్ సినిమాలో నటించిన తెలుగమ్మాయి శ్రీదివ్యకు కోలీవుడ్ లో ప్రస్తుతం చాలా అవకాశాలున్నాయి. తెలుగులో మల్లెలతీరం, బస్స్టాప్ చిత్రాల్లో నటించిన శ్రీదివ్యకు ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. దాంతో చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కిన శ్రీదివ్వ తమిళ పరిశ్రమలో మంచి ఛాన్స్ లు వచ్చాయి. పెన్సిల్, ఈటి, తాణా ఇలా వరుసగా ఒకే ఏడాదిలో 7 సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో టాప్ హీరోల పక్కన కూడా శ్రీదివ్యకు అవకాశాలు వస్తున్నాయి. పరిశ్రమకు వచ్చిన తక్కువ సమయంలోనే విశాల్, విక్రమ్, ప్రభూ, జీవా వంటి హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుంది.
ఇలా 7 సినిమాలతో బిజీగా వున్న శ్రీదివ్యపై అక్కడి మీడియాలో కొత్త కథనాలు మొదలయ్యాయి. శ్రీదివ్య రెమ్యూనరేషన్ పెంచింది, దర్శకులను, నిర్మాతలను సతాయిస్తోంది, యూనిట్కి చుక్కలు చూపిస్తోంది అంటూ టాకు మొదలైందట. కోలీవుడ్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం చూసి శ్రీదివ్య షాకుకు గురైందట. ఆపై, "అవన్నీ నా మీద వస్తున్న పుకార్లే, ప్లీజ్ వాటిని నమ్మకండి" అంటూ ప్రకటన ఇచ్చిందట. సిన్సియర్ గా పనిచేసుకుంటున్న తనపై ఇలాంటి రూమర్లు రావటం ఎంతో ఆశ్చర్యంగా వుందంటోంది శ్రీదివ్య.