English | Telugu

హీరో సూర్య రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు..!

రోడ్డుపై మనిషి ప్రమాదంలో ఉంటే, మనకెందుకులే అని వెళ్లిపోతున్నారు చాలా మంది. కారులో రక్తం మరకలౌతాయని భయపడేవాళ్లు మరికొంత మంది. మనిషి ప్రాణమంటే విలువ లేని ఇలాంటి కాలంలో, మానవత్వంతో తాను రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని నిరూపించుకున్నాడు హీరో సూర్య. ప్రమాదంలో గాయపడి రోడ్డు మీద పడివున్న మహిళను తన కారులో హాస్పిటల్ కు చేర్చాడు. ఈ సంఘటన మన రాష్ట్రంలోని మదనపల్లె సమీపంలో జరిగింది. విషయంలోకి వెళ్తే, సూర్య లేటెస్ట్ సినిమా ' 24 ' షూటింగ్ చిత్తూరు జిల్లా మదనపల్లె మండంలోని ఈడిగపల్లెలో జరుగుతోంది.

ఇక్కడికి దగ్గర్లో ఉన్న క్వారీలో షూటింగ్ ను పూర్తి చేసుకుని, రాత్రి తొమ్మిది గంటల సమయంలో సూర్య మదనపల్లెకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి ఉన్న మహిళను చూసిన సూర్య, ఆమెను తన కారులో ఎక్కించుకుని టౌన్ లోని హాస్పిటల్ కు చేర్చాడు. తాను హోటల్ కు చేరుకున్న తర్వాత కూడా, ఆమె పరిస్థితి ఎలా ఉందంటూ ఆరా తీశాడట. దీంతో స్థానికులు సూర్య దాతృత్వానికి ఆశ్చర్యపోతున్నారు. దగ్గరగా ఈ సంఘటనను చూసిన వారంతా, సూర్య నిజజీవితంలో కూడా హీరోయే అంటూ పొగుడుతున్నారు. నిజమే మరి. ఈ కాలంలో తోటి మనిషికి సాయం చేయడం కూడా గొప్ప విషయమే..! ఇప్పటికే సూర్య అగరం అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తూ, పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు. మనం సంపాదించుకుంటే చాలు, ఎవరెలా పోతే మనకెందుకులే అనుకునే ఇలాంటి కాలంలో సూర్య లాంటి మంచి మనసున్న హీరోకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.