English | Telugu

సన్నీ లియోన్ పై వంద కోట్లకు పరువు నష్టం దావా..!

సన్నీ లియోన్ పై పరువు నష్టం కేసు నమోదైంది. బిగ్ బాస్ కంటెస్టెంట్, మోడల్ పూజా మిశ్రా, సన్నీ పై బోంబే హైకోర్టులో వంద కోట్లకు పరువునష్టం దావా వేసింది. బిగ్ బాస్ ఐదో సీజన్లో తాను కంటెస్టెంట్ నని, తన తర్వాత సన్నీ లియోన్ కూడా షోలోకి ఎంటరైందని, తనమీద అసూయా ద్వేషాలతో మీడియా ఇంటర్వ్యూల్లో తన పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా మాట్లాడిందని పూజా మిశ్రా ఆరోపిస్తోంది. సన్నీ ఇచ్చిన ఇంటర్వ్యూల వల్ల తనకు నష్టం వాటిల్లిందని, వ్యక్తిగతంగా ఆర్థికంగా చాలా నష్టపోయానని, 100 కోట్లు పరిహారం ఇప్పించి, తనకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించుకుంది.

తనపై సన్నీ ఈర్ష, ఆసూయలతో కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది, పబ్లిక్ లో తనుకున్న ఇమేజ్ ను దెబ్బతీసింది అనేవి పూజా మిశ్రా ఆరోపణలు. సన్నీ ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక పేపర్లో రావడంతో, తన ఫిక్స్ డ్ డిపాజిట్లన్నింటినీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని, అందువల్ల దాదాపు 70 లక్షలు నష్టం వాటిల్లిందని తన దావాలో పేర్కొంది. ఐపిసి 500 120(బి) సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైకోర్టు వేసవి సెలవులు ముగిసే వరకూ, కేసును వాయిదా వేసింది. కాగా ఈ కేసుపై సన్నీ ఇంకా స్పందిచాల్సి ఉంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.