English | Telugu

సెప్టెంబర్ 26న 'గోవిందుడు..' సెన్సార్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అక్టోబర్ 1న విడుదల చేయాలని పట్టుదలతో వున్నాడు నిర్మాత బండ్ల గణేష్. దీని కోసం చిత్ర యూనిట్ సభ్యులు కూడా బాగా కష్టపడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరినట్లుగా తెలిసింది. రామ్ చరణ్ కూడా పగలు షూటింగ్ లో పాల్గొంటూ రాత్రి పూట డబ్బింగ్ వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 26న సినిమా సెన్సార్ బోర్డు ముందుకు వెళ్తుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన కుటుంబకథా చిత్రం తరహాలో తెరకెక్కుతున్న ‘గోవిందుడు అందరివాడేలే’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.