English | Telugu

ప్రేమమ్ హీరోయిన్ తో రాజ్ తరుణ్ సినిమా

షార్ట్ ఫిలిమ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్స్ లోకి చేరుకున్న రాజ్ తరుణ్ డైరీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. వరస సినిమాలు చేస్తూ చాలా బిజీగాఉంటున్నాడీ వైజాగ్ కుర్రాడు. తాజాగా దిల్ రాజు బ్యానర్లో మంచి ఫ్యామిలీ మూవీ చేసే ఛాన్స్ కొట్టేశాడు. శతమానం భవతి పేరుతో రాబోతున్న ఈ సినిమాలో ' ప్రేమమ్ ' ఫేంఅనుపమా పరమేశ్వరన్ ను రాజ్ తరుణ్ కు జోడీగా సెలక్ట్ చేశారట. ప్పటికే ఈ భామ చైతూతో ప్రేమమ్ చేస్తోంది. ' శతమానంభవతి ' ని మొదటసాయి థరమ్ తేజ్ తో అనుకున్నాడు దిల్ రాజు. కానీ అనుకోని కారణాల వల్ల చివరికి ఈ సినిమా రాజ్ తరుణ్ ఒళ్లో వాలింది. చివరిగా వచ్చిన తన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా నిరాశ పరచడంతో, ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు రాజ్ తరుణ్. సేమ్ సిట్యువేషన్ విత్ దిల్ రాజు కూడా. దీంతో ఇప్పుడీ సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి సినీజనాల్లో ఉంది. రాజ్ తరుణ్-అనుపమా పరమేశ్వరన్..రైమింగ్ అయితే బాగుంది మరి..

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.