English | Telugu

సర్దార్ హిందీ టీజర్ : పవన్ మరీ ఇంత అన్యాయమా

సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్ బాలీవుడ్ లో గ్రాండ్ స్టైల్ లో అడుగుపెడుతున్నాడు. అందుకే ఇంటర్వ్యూలు ఇష్టం లేకపోయినా, బాలీవుడ్ క్రిటిక్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు పవన్. కాసేపటి క్రితం ఎరోస్ నౌ సర్దార్ హిందీ టీజర్ రిలీజ్ చేసింది. మన టీజర్ మొత్తం కామెడీ ఎంటర్ టైన్మెంట్ తో నింపేశారు కానీ హిందీ టీజర్ మాత్రం, ఫుల్ యాక్షన్ తో కుమ్మేశాడు పవన్.

జో డర్ గయా..సమ్ జో మర్ గయా అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. గన్ భుజం మీద పెట్టుకుని యాటిట్యూడ్ తో పవన్ ఇచ్చే లుక్స్, గన్ సింగిల్ హ్యాండ్ తో లోడ్ చేసి రౌడీ ని పేల్చే షాట్, పిల్లలతో కలిసి పవన్ సిగ్నేచర్ బెల్ట్ స్టెప్, కార్లో ట్రావెల్ అవుతూ, గన్స్ దడదడాలాడించే షాట్, లాస్ట్ లో సింపుల్ గా గన్ ను ఒక రౌండ్ తిప్పి తిరిగి బెల్ట్ లో పెట్టే షాట్..

ఇవీ టీజర్లో మెయిన్ షాట్స్. హిందీ వాళ్లకెలా అనిపిస్తుందో గానీ, తెలుగోళ్లు మాత్రం గర్వంగా మనోడి సినిమారా అని చెప్పుకునేలా ఉంది టీజర్. కానీ పవనాభిమానులు మాత్రం ఇదేం అన్యాయం పవన్. ఈ యాక్షన్ మన టీజర్లో కూడా పెడితే నీకు పోయిందేముంది అంటున్నారు.కరెస్టే మరి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.