English | Telugu

ఆడియో ఫంక్షన్లో చిరంజీవి ఏం మాట్లాడతారు ?

చాలా కాలం తర్వాత మెగా బ్రదర్స్ అంతా కలిసి సర్దార్ ఆడియోలో కలిసి కనిపించబోతున్నారు. చిరు స్టేజ్ పై ఏం మాట్లాడతారు ? అని మెగాఫ్యాన్స్ లో ఒకటే ఉత్కంఠ. పవన్ జనసేన స్థాపించిన తర్వాత, బ్రదర్స్ మధ్య దూరం పెరిగింది. తన ఇంటర్వ్యూల్లో పవన్ చిరు ప్రస్తావన తీసుకురావడం మానేశారు. చిరు కూడా పవన్ గురించిన విషయాలు మాట్లాడటం మానేశారు. చిరు బర్త్ డే కు ముందురోజు నాగబాబు ఆవేశంగా మాట్లాడితే, మెగా బ్రదర్స్ మధ్య నిజంగానే ఏదో వివాదం నడుస్తోందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాతి రోజే, చిరు బర్త్ డే ఫంక్షన్ కు పవన్ హాజరై విష్ చేసి మళ్లీ బంధాన్ని చిగురించేలా చేశారు.

ఆ తర్వాత బ్రూస్ లీ కోసం అన్నదమ్ములు మళ్లీ కలవడం, సర్దార్ సెట్స్ కు చిరు వెళ్లడం, లేటెస్ట్ గా చిరును పవన్ ఆహ్వానించడం జరిగింది. అందుకే ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో చిరు దేని మీద మాట్లాడతారన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇద్దరూ రెండు వేరు వేరు పార్టీల్లో ఉండటంతో రాజకీయాల గురించి చిరు మాట్లాడే అవకాశం ఉందా..? అసలు ఒకరిపై ఒకరి ప్రేమ ఎలా ఉంటుందో, ఇద్దరూ కలిసి ఇన్నాళ్ల తర్వాత పబ్లిక్ గా ఎలా కనిపించబోతున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.