English | Telugu

చిరు.. బొమ్మ చూపిస్తున్నాడు

చిరంజీవి 150వ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డానికి ఏ ద‌ర్శ‌కుడూ ముందుకు రాలేదు. దానికి కార‌ణం.. చిరు పెట్టే టార్చ‌ర్‌, ఈ సినిమాపై ఉండే అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో వాళ్ల‌కు తెలుసు కాబ‌ట్టి. సినిమా హిట్ట‌యితే.. ఆ క్రెడిట్ ఓ రేంజులో వ‌స్తుంది. అదే అంచ‌నాలు త‌ప్పి, స‌రిగా ఆడ‌క‌పోతే.. అంద‌రూ ద‌ర్శ‌కుడ్ని నిందిస్తారు. ఆ నింద భ‌రించ‌డానికి ఏ ద‌ర్శ‌కుడికి ఇష్టం ఉంటుంది చెప్పండి?? ఆఖ‌రికి వినాయ‌క్ కూడా అన్య‌మ‌న‌స్కంగానే ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. ఇప్పుడు ఆ ఫ‌లితం అనుభ‌విస్తున్నాడు.

అఖిల్ త‌ర‌వాత‌.. మ‌రో సినిమా ఒప్పుకొంటే ఈ పాటికి స‌గం సినిమా పూర్తి చేసేవాడు వినాయ‌క్‌. చిరంజీవి 150 వ సినిమాని నెత్తిమీద వేసుకోవ‌డంతో అక్క‌డే ఇరుక్కుపోయాడు. క‌త్తి రీమేక్ ని తెలుగులో తీస్తున్నా.. ఆ స్ర్కిప్టు విష‌యంలో చిరంజీవికి చాలా అనుమానాలున్నాయి. ప‌ది మంది రైట‌ర్ల‌తో కత్తి స్ర్కిప్టుని తెలుగులో, చిరంజీవి ఇమేజ్ కి త‌గిన‌ట్టు మార్పులు చేశాడు వినాయ‌క్‌. అయితే... అదీ చిరంజీవిని సంతృప్తి క‌లిగించ‌లేద‌ని టాక్‌. ఒక ద‌శ‌లో వినాయ‌క్ ఈ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేద్దామ‌ని కూడా అనుకొన్నాడ‌ట‌. కానీ.. స‌న్నిహితులు వారించ‌డంతో ఓపిగ్గా భ‌రిస్తున్నాడ‌ట‌.

ఇప్పుడు క‌త్తిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి ఓ కొత్త క‌థ‌తో చిరుని మెప్పించ‌డమే ఈజీ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ట వినాయ‌క్‌. అందుకే ఓ రెండు క‌థ‌లూ వినిపించాడ‌ట‌. క‌త్తికంటే అవే బాగున్నాయ‌ని చిరంజీవి భావించ‌డంతో 150వ సినిమా విష‌యంలో కొత్త ట్విస్టు వ‌చ్చిన‌ట్టైంది. క‌త్తిని పక్క‌న పెట్టి కొత్త క‌థ‌లో త‌ల‌మున‌క‌ల‌య్యాడ‌ట వినాయ‌క్‌. మ‌రి ఈ స్ర్కిప్టు అయినా చిరుకి న‌చ్చుతుందో లేదో?? చిరు ఇలానే నానుస్తూ పోతూ ఉంటే... ఆయ‌న‌ 150వ సినిమా వ‌చ్చేనాటికి చ‌ర‌ణ్ కూడా ఓ వంద సినిమాలు పూర్తి చేసేస్తాడు. ఇప్ప‌టికైనా కాస్త స్పీడు పెంచు చిరు... లేదంటే నీ వీర ఫ్యాన్స్‌కీ నీర‌సాలు వ‌చ్చేస్తాయ్‌!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.