English | Telugu

"హుషారు"తో పవన్ కళ్యాణ్ బిజీ అవుతున్నాడు..!

ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సర్దార్ గబ్బర్ సింగ్ అభిమానుల అంచనాలను
అంతగా అందుకోలేకపోవడంతో పవన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తన అభిమానుల్ని డిప్రెషన్‌ లోంచి బయట పడేయాలని చూస్తున్న పవర్ స్టార్ తనకు ఖుషీలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబందించి చర్చలు ఇప్పటికే పూర్తవ్వడంతో త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఖుషీకి సీక్వెల్‌గా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఓ ప్రేమకథగా సినిమా ఉండనుంది. ఈ మూవీకి హుషారు అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ఎనర్జీ, స్టైల్‌కి తగ్గట్టు హుషారు సరిగ్గా సెట్టవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నెల 29న ఈ సినిమాను లాంచ్ చేయాలని పవన్ భావిస్తున్నారు. దీనిని పవన్ మిత్రుడు, శరత్ మరార్ నిర్మించనున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.