English | Telugu
మళ్లీ వివాదంలోకి చక్రి ఆస్తులు..చక్రి తల్లి దీక్ష
Updated : Mar 1, 2016
దివంగత సంగీత దర్శకుడు చక్రి ఆస్తుల వివాదం ఇంకా కొనసాగుతోంది. చక్రి మరణం తర్వాత ఆస్తుల విషయంలో, చక్రి భార్య శ్రావణికి, ఆయన తల్లి, సోదరుడితో వివాదాలు నడిచిన సంగతి తెలిసిందే. ఇవి మొదలై దాదాపు ఏడాదిన్నర అయినా, ఇంకా కొలిక్కి రాలేదు. అప్పట్లో జూబ్లీహిల్స్ పిఎస్ లో చక్రి భార్య, తల్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
తాజాగా, సోమాజిగూడలో వరుణ్ సర్గం విల్లా దగ్గర చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ దీక్షకు దిగారు. ఆ విల్లాలో ఉంటున్న మాధవి అనే మహిళ, విల్లాను ఖాళీ చేయట్లేదని, గత 8 నెలలుగా అద్దెను కూడా చెల్లించట్లేదని, శ్రావణే వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కొద్ది కాలం క్రితమే, చక్రి భార్య శ్రావణి, ఆస్తుల్ని అమ్మేసి, అమెరికా వెళ్లిపోయిందని, ఈ విల్లా తమకే దక్కుతుందని చక్రి సోదరుడు మహిత్ చెబుతున్నారు. ఫ్లాట్ లో సామాన్లు కూడా తమవేనని, మాధవి ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతోందంటూ, విల్లా ముందు విద్యావతి, మహిత్ నారాయణ్ దీక్షకు దిగారు.