English | Telugu

‘మనం’,‘సోగ్గాడే..’,‘ఊపిరి’ నాగ్ వాట్ నెక్ట్స్

అక్కినేని నాగార్జున..ప్రజంట్ లేటు వయసులో తన విశ్వరూపాన్ని చూపిస్తూ హ్యట్రిక్ సూపర్ హిట్లతో కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు. మనం, సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి చిత్రాలలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో ఇలాంటి సినిమాలు తను తప్ప ఎవరు చేయలేరని నిరూపించారు కింగ్. మరి వరుస సక్సెస్‌ల తర్వాత నాగ్ తర్వాతి సినిమా ఎంటీ? ఎవరితో చేస్తాడు? అందులో నాగ్ ఎలాంటి క్యారెక్టర్‌లో నటిస్తాడు? అనే క్వశ్చన్స్‌ అభిమానుల్ని చంపేస్తున్నాయి. అయితే తన తర్వాతి సినిమాలో నాగ్ భక్తుడిగా కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

వరుస రోమాంటిక్ హిట్‌ల తర్వాత మన్మథుడిలోని అసలు సిసలు నటుణ్ని పరిచయం చేసిన సినిమా అన్నమయ్య. ఈ సినిమా సక్సెస్ తర్వాత యాక్షన్, రోమాంటిక్ మూవీస్‌కి మాత్రమే నాగ్ సెట్ అవుతాడు కాని ఇలాంటివి నాగ్ డీల్ చేయలేడు అంటూ ఇండస్ట్రీలోని చాలా మంది అనుమానించారు.. విమర్శించారు. కానీ వారి అభిప్రాయాలను వమ్ము చేస్తూ కింగ్ అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలను అద్భుతంగా పోషించి తండ్రి లాగే తాను కూడా భక్తుడి పాత్రల్లో మెప్పించగలనని నిరూపించారు.

ప్రజంట్ అదే జోనర్‌లో మరోసారి భక్తుడి గెటప్ వేయాలని డాన్ డిసైడయ్యాడంట. శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరాం బాబా పాత్రలో నాగ్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి సినిమాలకు దర్శకత్వం వహించిన కె. రాఘవేంద్రరావే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ విషయాన్ని నాగార్జున కాని రాఘవేంద్రరావు కాని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.