English | Telugu

బాలయ్యను కూడా ఫుల్లుగా వాడేసుకుంటున్నారు..!

టాలీవుడ్ లో పెద్ద హీరోలను వాడుకుని చిన్న సినిమాలు బాగా ఆడించేసుకోవాలనుకునే పద్ధతి పాతదే. ఒకప్పుడు పెద్ద ఎన్టీఆర్ పేరును, ఏమంటివి ఏమంటివి డైలాగునూ సినిమాల్లో ఫుల్లుగా ఉపయోగించుకునేవారు. ఎన్టీఆర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పీక్స్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం జరిగింది. చిరు రాజకీయప్రవేశంతో, ఆ వారసత్వం పవన్ కళ్యాణ్ కు దక్కింది. లేటెస్ట్ గా బాలయ్య బాబును కూడా ఫుల్లుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మన సినీ జనాలు. ఇప్పటి వరకూ మెగా హీరోను మాత్రమే వాడుకోవడంలో ముందున్న సినీపరిశ్రమ పటాస్, కృష్ణగాడి వీర ప్రేమగాథతో బాలయ్య ను వాడుకోవడం మొదలెట్టింది. సింహా, లెజండ్ సినిమాల్లో బాలయ్య డైలాగులు చాలా బాగా పేలాయి. అందుకే ఆ సినిమాలను చూపించి, బాలయ్య మాస్ ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకుంటున్నారు.

పటాస్ లో బాలయ్య అరే ఓ సాంబా పాటను రీమేక్ చేయడంతో పాటు, ఆయన స్టిల్స్ వాడుకున్నారు. కృష్ణగాడి వీర ప్రేమగాథలో నాని కూడా జై బాలయ్య అంటూ లెజండ్ డైలాగ్స్ ను రింగ్ టోన్స్ గా వాడేశాడు. రన్ సినిమాలో కూడా సేమ్ డైలాగ్ ను రిపీట్ చేశారు. దీంతో నందమూరి హీరోలు మనమేం తక్కువ అనుకున్నారో ఏమో గానీ, మొన్న జరిగిన రాజా చెయ్యి వేస్తే ఆడియోలో మాట్లాడిన ప్రతీ ఒక్కళ్లూ జై బాలయ్య అని నినాదం ఇచ్చి ప్రసంగాన్ని ముగించారు. త్వరలో రాబోతున్న నారా రోహిత్ సావిత్రి సినిమాలో కూడా, 20 నిముషాల పాటు బాలయ్య స్పెషల్ గా ఎపిసోడ్ ఉంటుందని ఫిలింనగర్ టాక్. ఎవర్ని ఎంత వాడినా, పబ్లిసిటీ వరకూ మాత్రమే. ప్రేక్షకుడు హాల్ కు వచ్చిన తర్వాత బాలయ్య బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ చూడడు. సినిమాలో విషయం ఉందా లేదా అనేదే అతనికి ముఖ్యం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.