English | Telugu

మెగాస్టార్ కు, క్రికెటర్ కు మధ్య గొడవ..!

టి20 వరల్డ్ కప్ లో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఇండియన్స్ అందరికీ చిరస్మరణీయ మ్యాచ్ అన్న విషయం ఎవరూ కాదనలేనిది. విరాట్ కోహ్లీ సంచలన బ్యాటింగ్ తో ఒంటిచేత్తో టీం ఇండియాను సెమీస్ కు చేర్చేశాడు. అయితే ఈ విషయమై ఇప్పుడు మెగాస్టార్ కు, ఒక క్రికెటర్ కు మధ్య గొడవ జరుగుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఫ్లింటాఫ్, విరాట్ కోహ్లీ ఇలాగే ఆడితే, కొన్నాళ్లకు తమ క్రికెటర్ రూట్ స్థాయికి చేరుకుంటాడని వెళాకోళంగా ట్వీట్ చేశాడు. దానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రూట్ ఎవరు..? రూట్స్ తో సహా పీకేస్తాం అని రిప్లై ఇచ్చారు. ఫ్లింటాఫ్ మళ్లీ వెనక్కి అమితాబ్ బచ్చన్ ఎవరు అని రిప్లై ఇచ్చాడు.

నిజానికి ఫ్లింటాప్ కు అమితాబ్ ఎవరో, ఇండియాలో ఆయన ఫాలోయింగ్ ఎలాంటిదో తెలుసు. కానీ సరదాకి అలా ట్వీట్ చేశాడు. అదే అతను చేసిన తప్పయిపోయింది. అందులో వేళాకోళం అర్ధం కానీ అమితాబ్ బచ్చన్ అభిమానులు, ఫ్లింటాఫ్ ను ట్విట్టర్లో ఆడేసుకున్నారు. అతన్ని తిడుతూ, వెక్కిరిస్తూ ఇంకా రకరకాలుగా ఫ్లింటాఫ్ కు చుక్కలు చూపించారు. దాంతో ఫ్లింటాఫ్ తిరిగి ట్వీట్ చేయాల్సి వచ్చింది. తిట్లు గట్టిగానే వస్తున్నాయి. కొంతమందికి వేళాకోళం పరిగ్గా అర్ధమవ్వదు అనుకుంటా అంటూ ట్వీట్ చేశాడు ఫ్లింటాఫ్. అమితాబ్ కున్న 20 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లు, ఫ్లింటాఫ్ ను ఆడేసుకోవడంతో సైలెంట్ గా ఈ టాపిక్ నుంచి తప్పుకున్నాడు. 2007 వరల్డ్ కప్ లో, ఫ్లింటాఫ్ తో గొడవ తర్వాతే, యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టిన సంగతి తెలిసిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.