English | Telugu

అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన అయాన్..!

అల్లు అర్జున్ కు ట్విట్టర్ లో యమ ఫాలోయింగ్ ఉంది. ఆరు లక్షలమంది బన్నీని ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు. అందుకే బన్నీ ఏదైనా ట్వీట్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. సినిమాల గురించైతే అసలు ట్వీట్ చేయనని ఒక రూల్ కూడా తనకు తాను పెట్టుకున్నాడు. అయితే, ఈ రోజు ఉదయం బన్నీ ట్విట్టర్లో, సర్దార్ గబ్బర్ సింగ్ పాటకు ఐట్యూన్స్ లింక్ పోస్ట్ అయింది. సర్లే బన్నీకి దేవీశ్రీప్రసాద్ క్లోజ్. పైగా పవన్ మెగా హీరో కాబట్టి బన్నీ ఈ సాంగ్ ను పోస్ట్ చేశాడేమో అని అనుకున్నారు ఆయన ఫాలోవర్లు. కానీ ఆ తర్వాత ట్వీట్ అందరికీ షాక్ ఇచ్చింది.

మా అబ్బాయి అయాన్ కాసేపటి క్రితం ఐట్యూన్స్ లో సర్దార్ పాటలు వింటున్నాడు. ఇప్పుడు చూస్తే, నా ట్విట్టర్ ఎకౌంట్ లో సర్దార్ లింక్ పోస్ట్ అయిపోయింది. నాకు ఇది చాలా షాకింగ్. ఎందుకంటే వాడికసలు ఫోన్ వాడటమే రాదు. ఇది ఎలా పోస్ట్ చేశాడో అర్ధం కావడానికి నాకు పది నిముషాలు పట్టింది. నాకు ఇది చాలా షాకింగ్. ఇక నుంచీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పవన్ కళ్యాణ్ పాట కాబట్టి సరిపోయింది. అదే వేరొకరి పాటైతే ఏమై ఉండేదో అని నా భార్య అంటోంది అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. ఇంకా రెండేళ్లు కూడా పూర్తిగా నిండని బుడతడు, ఐఫోన్లో పాటలు వింటూ ట్వీట్ చేసేశాడంటే, రాబోయే జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉండబోతోందో అర్ధమవుతోంది కదా..!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.