English | Telugu

అమరావతిలో బాలయ్యకు చక్రవర్తిగా పట్టాభిషేకం..!

బాలయ్య అభిమానులకు రేపు ఉగాది పండగతో పాటు, సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాకాలంగా వందో సినిమా డిటెయిల్స్ చెబుతానంటూ ఊరిస్తున్న బాలయ్య, రేపే గుట్టు విప్పేయబోతున్నాడు. క్రిష్ డైరెక్షన్లో బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి చక్రవర్తిగా నటించబోతున్నాడు. అందరికీ తెలిసిందే అయినా, నందమూరి అందగాడు స్వయంగా చెబితేనే అభిమానుల మనస్సు స్థిమితపడుతుంది. అందుకే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో, శాతకర్ణి సినిమాకు శ్రీకారం చుడదామని ఫిక్సయ్యాడట.

అమరావతిలో ఉన్న బుద్ధవిగ్రహం దగ్గర ఉగాది రోజున ముహూర్తం షాట్ చిత్రీకరించనున్నారు. ఇప్పటికే దీని కోసం స్టేజ్ ను కూడా నిర్మించారు. ఛీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాబోతున్నారు. దాదాపు 60 కోట్లకు పైగా బడ్జెట్ ఎస్టిమేషన్ తో పూర్తి స్థాయి చారిత్రాత్మకంగా తెరకెక్కబోతోంది. బాలయ్యకు అద్భుతంగా సెట్ అయినా, పూర్తి స్థాయి చారిత్రాత్మక పాత్రను ఆయన ఎప్పుడూ చేయలేదు. ఆదిత్య 369లో కాసేపు మాత్రమే కృష్ణదేవరాయలుగా కనిపించి అలరించారు. జానపదం, పౌరాణికం సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు క్రిష్ తో హిస్టారికల్ మూవీ కూడా కంప్లీట్ చేస్తే, ఈ తరంలో నటిస్తున్న హీరోల్లో, ఇన్ని జానర్లలో నటించిన ఘనత అందుకున్న ఏకైక నటుడవుతారు. ప్రస్తుతం మూహూర్తం షాట్ చిత్రీకరించి, పూర్తి స్థాయి షూటింగ్ ను మే లో మొదలుపెట్టబోతున్నారు క్రిష్ అండ్ టీం. నయనతారను గానీ, త్రిషను గానీ హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.