English | Telugu

క‌రోనా ల‌క్ష‌ణాలంటూ కంగారుపెట్టిన టాప్ యాంక‌ర్‌.. క‌రోనా ఉందా? లేదా?

సాధార‌ణంగా ఎవ‌రైనా టెస్ట్ చేయించుకొని పాజిటివ్ అని నిర్ధార‌ణ అయితేనే త‌మ‌కు కొవిడ్‌-19 సోకింద‌ని బ‌హిర్గ‌తం చేసి, త‌మ‌తో స‌న్నిహితంగా మెల‌గిన వారిని అప్ర‌మ‌త్తం చేస్తారు. కానీ త‌న రూటే వేరు అన్న‌ట్లు టాప్ టీవీ యాంక‌ర్‌ అన‌సూయ టెస్ట్ రిజ‌ల్ట్ రాక‌ముందే, త‌న‌కు కొవిడ్‌-19 పాజిటివ్ అని నిర్ధార‌ణ కాక‌ముందే, అంద‌రినీ అప్ర‌మ‌త్తం చేశారు. నిజం చెప్పాలంటే, కంగారు పెట్టారు. ఆమెకు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయంట‌. అందుక‌ని త‌న‌తో ఇటీవ‌ల స‌న్నిహితంగా గ‌డిపిన వాళ్లు టెస్ట్ చేయించుకొమ్మ‌ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా కోరారు. గ‌మ‌నించాల్సిన విష‌య‌మేమంటే, ఆ పోస్ట్ పెట్టే స‌మ‌యానికి ఆమె క‌నీసం టెస్ట్ కూడా చేయించుకోలేదు.

ఆదివారం ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్‌లో, "అంద‌రికీ హ‌లో.. ఈరోజు ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం కోసం క‌ర్నూలుకు వెళ్లాల‌ని త్వ‌ర‌గా నిద్ర‌లేచాను. కానీ కొన్ని కొవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న‌ట్లు గ్ర‌హించి, నా షెడ్యూల్‌ను కేన్సిల్ చేసుకున్నాను. ప‌గ‌టి వెలుతురు క్షీణించ‌క‌ముందే సాధ్య‌మైనంత త్వ‌ర‌గా టెస్ట్ చేయించుకుంటాను. గ‌త కొద్ది రోజులుగా నాకు ద‌గ్గ‌ర‌గా మెల‌గిన ప్ర‌తి ఒక్క‌రినీ ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను." అని రాసుకొచ్చారు.

రెండు రోజుల క్రిత‌మే ఆమె ఓ వెబ్ సిరీస్ ఓపెనింగ్‌లో పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మంలో నిహారిక‌, చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ దంప‌తులు కూడా పాల్గొన్నారు. అంతే కాదు, డైరెక్ట‌ర్ వినాయ‌క్‌, సీనియ‌ర్ రైట‌ర్ వి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ సైతం అతిథులుగా హాజ‌ర‌య్యారు. వీరంతా అన‌సూయ‌కు ద‌గ్గ‌ర‌గా మెల‌గిన‌వాళ్లే. నిహారిక‌, చైత‌న్య అయితే అన‌సూయ‌తో క‌లిసి ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. వారంతా ఇప్పుడు టెస్ట్ చేయించుకోవాల్సిందేనన్న మాట‌.

ఇంకో సంగ‌తేమంటే.. ఇంత‌దాకా త‌ను టెస్ట్ చేయించుకున్న‌దీ, లేనిదీ అన‌సూయ వెల్ల‌డించ‌లేదు. నిన్నే టెస్ట్ చేయించుకున్న‌ట్ల‌యితే ఈస‌రికి ఎప్పుడో రిజ‌ల్ట్ తెలిసి ఉండేది. కానీ ఒక రోజు గ‌డిచిపోయినా దీనిపై ఆమె అప్‌డేట్ ఇవ్వ‌లేదు. అస‌లు.. టెస్ట్ చేయించుకోకుండానే, త‌న‌కు కొవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డ‌మేంటి, మిగ‌తావాళ్ల‌ను కంగారుపెట్ట‌డ‌మేంట‌ని చాలా మంది ప్ర‌శ్నిస్తున్నారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.