English | Telugu

ఐశ్వర్యతో హోలాండ్.. ప్రియాంకతో ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్ ప్రాంకోయిస్ హోలాండ్ ప్రపంచాన్ని కనుసైగతో శాసించగల అగ్రదేశాధినేతలు. వీరితో పరిచయం కావాలని దేశాధినేతల నుంచి ప్రముఖుల వరకు తహతహలాడతారు. అయితే వీరు మాత్రం బాలీవుడ్ భామలతో ముచ్చటించాలని కోరుకుంటున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గతంలోనూ వర్తమానంలోనూ జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఈ సంవత్సరం భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ఫ్రాంకోయిస్ హోలాండ్ గౌరవార్థం భారత ప్రభుత్వం విందును ఏర్పాటు చేసింది.

అయితే ఈ విందుకు హాజరు కావాల్సిందిగా ఐశ్వర్యరాయ్‌కి ఆహ్వానం అందింది. ఫ్రాన్ ప్రభుత్వం రెకమండేషన్‌తోనే ఇన్విటేషన్ వెళ్లిందని అప్పట్లో వార్తలు నడిచాయి. ఈ విందులో ఐశ్వర్య ప్రత్యక ఆకర్షణగా నిలిచారు. రెడ్ కలర్ బెనారస్ పట్టుచీరలో భారతీయ సంస్కృతి మూర్తీభవించిన నిండు మహిళగా ఐశ్వర్య సందడి చేశారు. ఓ టేబుల్ వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్, ఐశ్వర్య ముచ్చట్లు చెప్పుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇప్పుడు ఈ కోవలోకి మరో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వచ్చి చేరారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన సతీమణి మిషెల్ ఒబామాలతో కలిసి విందులో పాల్గొనాల్సిందిగా ప్రియాంకు వైట్‌హౌస్ నుంచి ఆహ్వానం అందింది. అయితే ప్రియాంకతో పాటు హాలీవుడ్ ప్రముఖులు బ్రాడ్లీ కూపర్, లూసీ లియూ, జేన్ ఫోండా, గ్లాడిన్ వైట్‌లు కూడా శ్వేత సౌధం నుంచి ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచం మొత్తం అగ్రదేశాధినేతల చుట్టూ తిరుగుతుంటే వీరు మాత్రం మన బాలీవుడ్‌ను కోరుకోవడం, భారతీయ చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా చూడాల్సిందే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.