Read more!

English | Telugu

అజిత్ హీరోగా 100 కోట్లతో "బిల్లా-2" సీక్వెల్

అజిత్ హీరోగా 100 కోట్లతో "బిల్లా-2" సీక్వెల్ తీస్తున్నారట. "బిల్లా" చిత్రం తమిళంలో అజిత్ హీరోగా నిర్మించినప్పుడు ఆ "బిల్లా" చిత్రం సూపర్ హిట్టయ్యింది. గతంలో ఈ "బిల్లా-2" సినిమాకి వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయించారు. ఈ అజిత్ "బిల్లా" చిత్రానికి సీక్వెల్ గా నిర్మిస్తున్న "బిల్లా-2" చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. చక్రి తోలేటి గతంలో సకల కళావల్లభుడు కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన "ఈనాడు" చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ చక్రి తోలేటి గతంలో కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన "సాగర సంగమం" చిత్రంలో కమల్ హాసన్ డ్యాన్స్ ఫోజులను ఫొటోలు తీయటానికి ప్రయత్నించే కుర్రాడిగా, "గీతాంజలి" చిత్రంలో కూడా ఒక సీన్లో నటించాడు. ఈ అజిత్ "బిల్లా-2" సీక్వెల్ చిత్రం ఒరిజినల్ చిత్రానికన్నా గొప్పగా ఉంటుందనీ, చాలా రిచ్ గా ఉంటుందనీ ఈ చిత్రం యునిట్ అంటూంది. ఉండదూ మరీ. వంద కోట్లు ఖర్చుపెడితే ఏ చిత్రమన్నా రిచ్ గానే ఉంటుంది. కాకపోతే ఆ వందకోట్లు తిరిగొస్తే ఫరవాలేదు. లేకపోతే...?