English | Telugu

ప్రముఖ నటి కన్నుమూత.. అప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడిలా...

- టాలీవుడ్ లో మరో విషాదం
- ప్రముఖ నటి జయవాహిని కన్నుమూత

తెలుగు పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పలు సినిమాలు, సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి జయవాహిని కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె.. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. (Actress Jaya Vahini)

విజయనగరానికి చెందిన జయవాహిని.. టెలివిజన్, సినీ రంగాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా టీవీ సీరియల్స్ లో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తెలుగుతో పాటు తమిళ సీరియల్స్ లోనూ నటించి గొప్ప పేరు సంపాదించుకున్నారు. అయితే క్యాన్సర్ తో పోరాడుతూ కొంతకాలంగా నటనకు దూరమయ్యారు. చివరిగా 'బహిర్భూమి', 'పోలీస్ వారి హెచ్చరిక' వంటి సినిమాల్లో ఆమె నటించారు.

జయవాహిని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ముఖ్యంగా జయవాహినితో మంచి అనుబంధమున్న కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ లు పెట్టారు. "అక్కా నిన్ను కాపాడాలని చాలా ప్రయత్నం చేసినా ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయావు. నువ్వు కరాటే నేర్చుకున్నప్పుడు విజయనగరం లో సైకిల్ మీద వెళ్తూ స్కూల్ నుండి నన్ను కూడా ఎక్కించుకొని మా ఇంటిదగ్గర దింపిన రోజులు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. కేన్సర్ ఎప్పటికైనా ప్రాణాంతకం. మహిళలు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోండి. అక్క బాధను మేము చూడలేకపోయాము. భగవంతుడు కూడా ఆమె బాధ చూడలేక దగ్గరకి తీసుకున్నాడు" అంటూ కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.

టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. ఎందుకు అలా చేస్తున్నారు

తెలుగు సినిమా ప్రేమికులు 'మనోజ్ బాజ్ పేయి'(Manoj Bajpayee)పేరు చెప్పగానే చాలు, విలక్షణమైన పెర్ ఫార్మెన్స్ కి పేటంట్ హక్కు తీసుకున్న యాక్టర్ కదా అంటారు. పైగా తన గురించి మనం ఏం చెప్పబోతున్నామో పూర్తిగా వినకుండానే సదరు మూవీ లవర్స్ ఎంతో ఆనందంతో 'సత్య మూవీలోని బీకు మాత్రే, ప్రేమకథ లోని శంకరం, అల్లు అర్జున్  హ్యాపీ లోని డిసిపి అరవింద్, పవన్ కళ్యాణ్  పులి లోని ఏ ఐ సలీం, వేదం లోని రహీముద్దీన్ ఖురేషి క్యారెక్టర్స్ లలో మనోజ్ బాజ్ పేయి ఒక రేంజ్ లో  చేసాడు కదా అని స్టార్ట్ చేస్తారు.ఆయన పెర్ ఫార్మెన్స్ కి   అంత రేంజ్ ఉంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.